నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్ 27న బీహార్ రాజధాని పాట్నాలో జరిపిన పేలుళ్ల ఘటన కేసులో తొమ్మిది మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. నాడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ.. పాట్నాలోని గాంధీ మైదాన్ లో ‘హూంకార్’ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే, బీజేపీ ప్రధాన నేతలు రావడానికి ముందు వేదిక వద్ద దుండగులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 80 మంది గాయపడ్డారు.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి), ఇండియన్ ముజాహిదిన్ కు చెందిన 10 మందిపై ఎన్ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. అందులో సరైన ఆధారాలు లేవన్న కారణంగా ఫక్రుద్దీన్ అనే నిందితుడిని కోర్టు విడుదల చేసింది. నుమాన్ అన్సారీ, హైదర్ అలీ అలియాస్ బ్లాక్ బ్యూటీ, మహ్మద్ ముజీబుల్లా అన్సారీ, ఒమర్ సిద్ధిఖీ, అజారుద్దీన్ ఖురేషీ, అహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇఫ్తికార్ ఆలం, మహ్మద్ ఫిరోజ్ అస్లాం, మరో మైనర్ ను దోషులుగా తేల్చింది. తారిఖ్ అన్సారీ అనే మరో నిందితుడు పాట్నా జంక్షన్ లోని టాయిలెట్ లో బాంబు పెడుతుండగా అది పేలి చనిపోయాడు.
నిందితులకు వచ్చే నెల ఒకటిన కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. కాగా, హూంకార్ ర్యాలీలో మొత్తం 17 ఐఈడీలను అమర్చగా.. అందులో ఏడింటిని పేల్చారు. దోషుల్లో ఎక్కువ మంది ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని సిథియోకు చెందిన వారే. ప్రస్తుతం వారంతా పాట్నాలోని బ్యూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. 2013 నవంబర్ 6 నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. మొత్తంగా 250 మంది సాక్షులను విచారించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more