తీన్మార్ మల్లనగా తెలంగాణ ప్రజలకు సుపరిచితుడైన చింతపండు నవీన్ కు నిజామాబాద్ న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ కస్టడికీ విధించింది. దీంతో పోలీసులు ఆయనను నిజామాబాద్ జైలుకు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కల్లు వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించిన కేసులో జర్నటిస్టుగా కల్లులోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకువస్తానని బెదిరింపులకు పాల్పడిన నవీన్.. వెలుగులోకి వాటినిన రానీయకూండదంటే తనకు డబ్బును చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశాడని కల్లు వ్యాపారి పిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.
క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేతగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తనను బెదిరింపులకు గురిచేసి డబ్బను అడుగుతున్నారన్న కల్లు వ్యాపిరి పిర్యాదు మేరకు ఈ నెలలో కేసును నమోదు చేసిన పోలీసులు.. మల్లన్నను ఈ నెల 25 న్యాయస్థానంలో హాజరుపర్చాగా.. నిజామాబాద్ కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా ఇదే కేసులో ఎ1 నిందితుడిగా వున్న మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, ఎ2 నిందితుడుగా ఉన్న మల్లన్నను నిన్న న్యాయస్థానంలో హాజరుపర్చారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన కల్లు వ్యాపారిని మొదట మల్లన్న అనుచురుడు ఉప్పు సంతోష్ బెదిరించాడని, అయితే అతడి మాటలను కల్లు వ్యాపారి పెద్దగా పట్టించుకోలేదని, దీంతో ఏకంగా మల్లన్నే వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేశాడని తెలుస్తోంది. దీంతో మల్లన్నను ఈ కేసులో ఏ2 నిందితుడిగా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు ఈ నెల 10న నమోదు కాగా, అదే రోజున సంతోష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఆ సమయంలో మల్లన్న మరో కేసులో చంచల్గూడ జైలులో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో చంచల్గూడ నుంచి మల్లన్నను తీసుకొచ్చిన పోలీసులు నిన్న నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more