అవినీతి అంతం.. వైసీపీ పంతం అంటూ నినదించిన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అధికారులు నిసిగ్గుగా లంచాలు తీసుకుంటూ.. పైలు కదలాలన్నా.. పని జరగాలన్నా.. కనీసం ఓ ధ్రువీకరణ పత్రం జారీ కావాలన్నా చేయి తడపాల్సిందేనంటూ తెగేసి మరీ చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పును తీసుకురావాలనిభావించిన వైసీపి వీరాభిమాని.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను తమ ప్రభుత్వ అధినేత దృష్టికి తీసుకువచ్చేందుకు ఇచ్చేందుకు పూనుకున్నాడు.
తనకు జరిగిన అనుభావాన్ని.. తహసీల్దార్ కార్యాలయంలో తాను ఎదర్కోన్న పరాభవాన్ని.. సమాచార హక్కు చట్టం నుంచి తప్పించుకుంటున్న అధికారుల ఎత్తుగడల్ని వారి అతి తెలివితో చట్టం కూడా చాపచుట్టే విధానాన్ని వివరించడానికి కదిలాడు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. లక్షల రూపాయలను వేతనాలుగా పోందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు.. అది ప్రజాధనం అని మర్చి.. మళ్లీ ప్రజల నుంచి లంచాలను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ.. ఈ విషయాలను ముఖ్యమంత్రికి లేదా రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న మార్గం పాదయాత్ర.
వివరాల్లోకి వెళ్తే.. గుడివాడలోని ధనియాలపేట ఆంజనేయస్వామి గుడి వీధికి చెందిన పల్లపు శ్రీనివాసరావు వైసీపీ అభిమాని. అతడి తల్లికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో మూడు సెంట్ల భూమి ఉంది. ఆమె మరణించడంతో ఆ భూమిపై తనకు స్వతహాగా రావాల్సిన హక్కు కోసం కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ పత్రం ఇచ్చేందుకు అధికారులు తనను లంచం అడిగారని ఆయన అరోపించారు. దీంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినా తప్పించుకునే ప్రయత్నాలే చేస్తున్నారని ఆయన అరోపిస్తున్నారు.
తనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే తప్పక చేతులు తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సహా చట్టం కింద వివరాలు అడిగి.. నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయాడు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని వివరించేందుకు నిన్న తాడేపల్లికి పాదయాత్ర ప్రారంభించాడు. ‘అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం.. సీఎం సారూ.. నాకు న్యాయం చేయండి’ అని ప్లకార్డు పట్టుకుని మెడలో వైసీపీ కండువా వేసుకుని పాదయాత్ర ప్రారంభించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more