Petrol, Diesel Prices Hiked Again, At Fresh All-Time Highs మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. వాహనదారులకు వాయింపులు..

Petrol and diesel hit fresh record highs as prices hiked on october 23rd

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Fuel prices continue to rise for the second straight day on Saturday, October 23, to hit fresh all-time highs following a surge in global crude oil rates. In the national capital, petrol and diesel rates soared 35 paise to cost ₹ 107.24 and ₹ 95.97 per litre respectively after the latest hike.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. వాహనదారులపై చమురు సంస్థల దోపిడి

Posted: 10/23/2021 11:34 AM IST
Petrol and diesel hit fresh record highs as prices hiked on october 23rd

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు సరికొత్త ఎత్తులను తాకుతూ.. వాహనదారులను వాయించేస్తున్నాయి. పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలను కూడా అదే స్థాయిలో పెంచుతుండటంతో.. దాని ప్రభావం దేశంలోని నిత్యావసర సరుకులు, రవాణ సహా అన్నిరంగాలపై పడుతున్నాయి. జూలై నెల 17న తొలిసారిగా గరిష్ట ధరలకు చేరిన చమురు ధరలు.. రెండు నెలల పాటు స్థబ్దుగా కొనసాగుతూ వచ్చి తాజాగా అల్ టైమ్ హై స్థాయిని అందుకున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న ధరలతో రోజురోజు సరికొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి ఇంధన ధరలు.

ఇంధన ధరల పెంపుపై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా దరలను పెంచూతూ వాహనదారులకు షాకిస్తోంది. ఇదిలావుండగా, కరోనా టీకాను ఉచితంగా దేశ ప్రజలకు ఇచ్చేందుకు ధరలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి వ్యాఖ్యలు కూడా అగ్గిరాజేస్తున్నాయి. గత ఐదు నెలల కి్త్రం పెట్రోల్ ధర లీటరు వంద మార్కును అధిరోహించగా.. ప్రస్తుతం దేశంలో ఏక్కడ పెట్రోల్ ధర వందకు దిగువన లేకుండాపోయింది.  

ఇక తాజాగా డీజిల్ ధర కూడా వంద రూపాయల మార్కును అందుకుంది. ఇక ఇందులో రెండు నెలల పాటు ధరల పెంపుకు కళ్లెం పడినా డీజిల్ వంద రూపాయల మార్కును అందుకుంది. ఇంధన ధరల గణనీయమైన పెంపుతో మరీ ముఖ్యంగా డీజిల్ ధర పెంపు ప్రభావం నిత్యావసర సరుకులతో పాటు అన్ని రంగాలపై పడుతోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. అయితే అర్బీఐ గవర్నర్ మాటలను కూడా చమురు సంస్థలు ఆలకించినట్టు లేవు.

చమురు కెంపెనీలు ఇంధన ధరలను మే నెలలో ఏకంగా 16 సార్లు, జూన్ నెలలో 16 సార్లు, జూలైలో పది పర్యాయాలు పెంచాయి. అయితే ఇంధన ధరలను తగ్గించాల్సిందేనన్న డిమాండ్ పెల్లుబిక్కిన నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలలుగా ఇంధన ధరల జోలికి వెళ్లన చమురు సంస్థలు.. సెప్టెంబర్ నెలాఖరులలో మాత్రం మళ్లీ వాహనాదారులకు షాకిచ్చిన ఇంధన సంస్థలు.. నానాటికీ ధరలు పెరుగుతూనే వున్నాయి. అక్టోబర్ లో పండుగ బిజీలో ప్రజలు ఉండగా, చాప కింద నీరులా ధరలను పెంచుతూనే వున్నాయి ఇంధన కంపెనీలు. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన ధరల పెంపు ఇప్పటివరకు పెట్రోల్ పై ఏకంగా 19సార్లు, డీజిల్ పై 22సార్లు పెంచాయి.

ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరపై ఏకంగా మరోమారు 35 పైసల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది మే 3న దేశ రాజధాని ఢిల్లీలో పెట్రల్ ధర 90.40గా నమోదు కాగా డీజిల్ ధర 80.73గా నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు చమురు ధరను 55 పర్యాయాలు పెంచిన కేంద్రం.. మే నెల నుంచి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.16.84, డీజిల్‌పై 15.24 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో సరికొత్త రికార్డులను అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.111 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 107.24గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.95.97కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.104.00కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.     104.22గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.100.25కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.12గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.98.38కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.96 కాగా, లీటరు డీజిల్ ధర రూ.104.53కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.111.55గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.104.70కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.98గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.101.86కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.110.84గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.102.57కు చేరింది.
భూపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.115.90గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.105.27కు చేరింది
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.103.21గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.95.68కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.104.20గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.96.42కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.109.14గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.102.77కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles