అలనాటి నటి, నర్తకి సుధాచంద్రన్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్షమాపణ చెప్పింది. ఇటీవల సుధాచంద్రన్కు ఎయిర్పోర్టులో పరాభవం ఎదురైంది. సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారిణి.. నటి సుధాచంద్రన్ను కృత్రిమ కాలును తీసి చూపించమని అడిగింది. అయితే తన నాట్యవిన్యాసాలను దేశదేశాల్లో ఇస్తున్న సుధాచంద్రన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రతీసారి ఇదే పరాభావం ఎదురుకావడంతో అమె తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఇవాళ ఉదయం ప్రధాని మోడీకి ఇలాంటి పరిస్థితులను కనీసం తనలాంటీ సీనియర్ సిటిజన్ల కోసమైనా నిబంధనలను కొంచెం సడలించాలని కోరారు.
ఈ మేరకు అమె తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా అమె ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టు సారాంశం సాగిందిలా.. ‘గుడ్ ఈవినింగ్ ప్రధాని మోదీగారు నేను మీకొక పర్సనల్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది కేంద్ర ప్రభుత్వానికి నా అభ్యర్థన. నా పేరు సుధాచంద్రన్. వృత్తిరీత్యా నటిని, డ్యాన్సర్ను. కృత్రిమ కాలుతో నృత్యాలు చేసి చరిత్ర సృష్టించాను. నా దేశం గర్వపడేలా చేశాను. నేను నా ఈవెంట్ల కోసం ఎక్కడి వెళ్లినా ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది నా కృత్రిమ కాలును తీసి చూపించాలనడం పరిపాటిగా మారింది. ఇది మానవీయమేనా మోదీ గారు..? దేశం ఎక్కడికి వెళ్తున్నది..? మన దేశంలో ఒక మహిళ సాటి మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా..?’ అని వీడియోలో ప్రశ్నించారు.
మోదీగారు దయచేసి సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ అని తెలిపే కార్డులను ఇప్పించండని కోరారు. ఈ వీడియోపై సీఐఎస్ఎఫ్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. నటి, నర్తకి సుధాచంద్రన్ క్షమాపణలు చెబుతూ దిగివచ్చింది. సుధాచంద్రన్ గారూ మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. ప్రొటోకాల్ ప్రకారం భద్రత కోసం కృత్రిమ అవయవాలను తీసి చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రయాణికులను అవమానించాలనే ఉద్దేశం కాదు అంటూ సీఐఎస్ఎఫ్ ట్వీట్ చేసింది. నటి సుధాచంద్రన్ గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more