ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. రైతుల నిరసనలో భాగంగా దసరా సందర్భంగా ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలను దహనం చేస్తామని రైతు నేత యోగేంద్ర యాదవ్ శనివారం ప్రకటించారు.
‘రైతుల హత్య కుట్రకు పాల్పడిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలి’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ‘దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు అక్టోబర్ 12న లఖింపూర్ ఖేరి చేరుకుంటారు. పౌర సంస్థలన్నీ రాత్రి 8 గంటలకు (అక్టోబర్ 12న) తమ నగరాల్లో క్యాండిల్ మార్చ్లు చేపట్టాలని మేము అభ్యర్థిస్తున్నాం. జలియన్ వాలా బాగ్ కంటే ఇక్కడ తక్కువ ఏమి జరగలేదు’ అని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. లఖింపూర్ ఖేరిలో మరణించిన రైతుల బూదిదతో రైతులు ప్రతి రాష్ట్రానికి వెళ్లి నిమజ్జనం చేస్తారని ఆయన తెలిపారు.
అక్టోబర్ 15న దసరా రోజున రైతులంతా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేస్తారని చెప్పారు. ‘అక్టోబర్ 18న మేం ‘రైల్ రోకో’ నిర్వహిస్తాం. 26న లక్నోలో భారీ మహాపంచాయత్ ఉంటుంది’ అని యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. కాగా, రైతులను భయపెట్టేందుకే వారిపై దాడి చేసేశారని మరో రైతు నేత దర్శన్ పాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు మరో రైతు నేత జోగిందర్ సింగ్ ఉగ్రన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more