price hike sends fuel rates in Delhi, Mumbai to record highs వరుసగా ఏడవ రోజు.. ఇంధన ధరల కొత్త గరిష్టాలు..

Petrol price hits record rs 104 in delhi crosses rs 110 in mumbai

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Price of petrol and diesel were hiked by oil marketing companies for the seventh consecutive day on Monday, taking fuel rates to record highs as crude oil prices soar. Petrol in the national capital today costs Rs 104.44 per litre, up 30 paise since yesterday while diesel in the capital city is retailing at Rs 93.17 per litre, an increase of 35 paise.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పైపైకి ఎగబాకుతూ.. సరికొత్త గరిష్టాలకు..

Posted: 10/11/2021 01:48 PM IST
Petrol price hits record rs 104 in delhi crosses rs 110 in mumbai

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. జూలై నెల 17న తొలిసారిగా అత్యంత అధిక ధరలకు చేరిన చమురు ధరలు.. ఆ తరువాత కాసింత కిందకు జారి.. మళ్లీ రెండు నెలల తరువాత ఆ ధరలను మించిపోయి అల్ టైమ్ హై స్థాయిని అందుకున్నాయి. ప్రతీ రోజు పెరుగుతున్న ధరలతో రోజురోజు సరికొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా ఇంథన దరలను పెంచూతూ వాహనదారులకు షాకిస్తోంది. ఇటు పెట్రోల్, అటు డీజిల్ ధరల పెంపుతో దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది.

ఏడురోజులగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో డీజిల్ కూడా వంద రూపాయల మార్కును అందుకుంది. సరిగ్గా పెట్రోల్ ధర వంద మార్కును అందుకున్న నాలుగు నెలల తరువాత డీజిల్ కూడా రూ.100 ను అందుకుంది. ఇక ఇందులో రెండు నెలల పాటు ధరల పెంపుకు కళ్లెం పడినా.. డీజిల్ వంద మార్కును అందుకుంది. ఇక ఇంధన ధరల గణనీయమైన పెంపుతో మరీ ముఖ్యంగా డీజిల్ ధర పెంపు ప్రభావం నిత్యావసర సరుకులతో పాటు అన్ని రంగాలపై పడుతోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

చమురు కెంపెనీలు ఇంధన ధరలను మే నెలలో ఏకంగా 16 సార్లు, జూన్ నెలలో 16 సార్లు, జూలైలో పది పర్యాయాలు పెంచాయి. అయితే ఇంధన ధరలను తగ్గించాల్సిందేనన్న డిమాండ్ పెల్లుబిక్కిన నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలలుగా ఇంధన ధరల జోలికి వెళ్లన చమురు సంస్థలు.. సెప్టెంబర్ నెలాఖరులలో మాత్రం మళ్లీ వాహనాదారులకు షాకిచ్చాయి. ఇక అక్టోబర్ నెల నుంచి వరుసగా ఇంధన ధరలు పెరుగుతూనే వున్నాయి. అక్టోబర్ లో పండుగ పర్వదినాలు రావడంతో ఎవరి పనులలో వారు నిమగ్నం కాగా, చాప కింద నీరులా ధరలను పెంచుతూనే వున్నాయి ఇంధన కంపెనీలు. కాగా, దీంతో పాటు దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.110 మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతొంది.

ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 30 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరపై ఏకంగా మరోమారు 35 పైసల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది మే 3న దేశ రాజధాని ఢిల్లీలో పెట్రల్ ధర 90.40గా నమోదు కాగా డీజిల్ ధర 80.73గా నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు చమురు ధరను 51 పర్యాయాలు పెంచిన కేంద్రం.. మే నెల నుంచి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.14.04, డీజిల్‌పై 12.44 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.108 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 104.44గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.93.17కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.110.41గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.101.03కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.79గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.59కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.105.09గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.96.28కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ..109.50 కాగా, లీటరు డీజిల్ ధర రూ.103.24కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.108.64గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 101.66కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.108.08గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.98.89కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.99గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ. 100.04కు చేరింది.
భూపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.112.82గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.102.11కు చేరింది
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.100.53గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.92.90కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 101.47గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.93.61కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.106.99గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.99.82కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles