ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ సహా ఎనమిది మందిని అదుపులోకి తీసుకన్న ఎన్సీబీ అధికారులుపై సంచలన ఆరోపణలు సంధించారు మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన దాడులు ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగాయని ఆయన అరోపించారు. ఈ దాడులలో బీజేపి నేతల సమీప బంధవులు కూడా ఉన్నారని అయితే వారిని ఎన్సీబి అధికారులు వదిలేశారని ఆయన అరోపించారు.
ఈ మొత్తం వ్యవహరానికి నేతృత్వం వహించిన ఎన్సీబి ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖేడే దాడులు జరిగిన సందర్భంలో మొత్తంగా 8 నుంచి 10 మంది వరకు అదుపులోకి తీసుకున్నామని చెప్పారని, ఒక బాధ్యతాయుతమైన అధికారిగా వుంటూ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారన్న సరైన సంఖ్యను ఎందుకు చెప్పలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అయితే ఎన్సీబి అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా దాడుల్లో పాల్గోన్నారని ఆయన తెలిపారు. మొత్తం 11 మందిని ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారని అయితే.. అందులో ముగ్గురు నిందితులను ఎందుకు న్యాయస్థానంలో ప్రవేశపెట్టలేదని ఆయన నిలదీశారు.
పట్టుబడ్డ వారిలో మహారాష్ట్రాకు చెందిన ఓ బడా బీజేపి నాయకుడి బావమరిది కూడా వున్నాడని నిన్నఅరోపణలు చేసిన ఆయన.. ఇవాళ బీజేపి రాష్ట్ర స్థాయి నేత మోహిత్ కంబోజ్ బావమరిది రిషబ్ సచ్ దేవ్ కూడా వున్నాడని పేర్లను వెల్లడించారు. రిషబ్ సచ్ దేవ్ తో పాటు మరో ఇద్దరు బీజేపి నేతల సంతానం కూడా ఇందులో వున్నారని అయితే వారిని ఎందుకు తప్పించారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ నేతలు, ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే మధ్య సంప్రదింపులు జరిగి ఉంటాయని వ్యాఖ్యానించారు.
రేవ్ పార్టీలో 11 మందిని అరెస్ట్ చేయగా క్రూయిజ్ షిప్పై దాడుల అనంతరం సమీర్ వాంఖడే 8 నుంచి 10 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎలా చెప్పారని మాలిక్ గుర్తుచేశారు. ఆపై రిషబ్ సచ్దేవ, ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నిచ్వాలా అనే ముగ్గురిని విడుదల చేశారని అన్నారు. క్రూయిజ్ షిప్పై దాడుల్లో 11 మంది పట్టుబడితే ఎవరి ఆదేశాలపై ముగ్గురు నిందితులను వదిలివేశారో చెప్పాలని ఎన్సీబీని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ అంశంపై ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ చే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ తాను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాస్తానని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more