దేశానికి చెందిన పలు రాష్ట్రాల యువత ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం పట్ల ఆకర్షితులై.. అందులో చేరడానికి ప్రయత్నించగా, భారత బలగాలు వారిని విమానాశ్రయాలలో అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం అనేక మార్గల్లో అన్వేషణ సాగించి ఇస్లామిక్ స్టేట్ లో చేరారు. ఇందులో కొందరు అక్కడి దౌర్భగ్య, దుర్మార్గ పరిస్థితిని ఇమడలేక తిరిగి స్వదేశానికి తిరిగిరాగా, కొందరు మాత్రం అందులో కొనసాగుతున్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అలాంటి అనుమానాస్పద ట్వీట్ చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత కాబూల్ శివార్లలో జరిగిన ఒక ఘటనలో అక్కడకు చేరుకున్న కొందరు తాలిబన్ ఉగ్రవాదులలో ఒకడు తాము విజయం సాధించామనే ఆనందంలో నేలపై కూర్చొని ఆనందబాష్పాలు రాల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీన్ని చూసిన శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తాలిబన్లలో కనీసం ఇద్దరు మలయాళీలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీడియోలో ఒకడు ‘సంసరికెట్టె’ అన్నాడని, దాన్ని మరొకడు అర్థం చేసుకున్నాడని శశిథరూర్ విశ్లేషించారు. అయితే ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాలిబన్లతో మలయాళీలను ముడిపెట్టడం సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
కేరళను తాలిబన్ ఉగ్రవాదులతో ముడిపెట్టడం సరికాదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ నేత వినీత్ గోయెంకా కూడా స్పందించారు. ఇదేమీ కామెడీ షో కాదంటూ శశిథరూర్కు కౌంటర్ ఇచ్చిన ఆయన.. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి స్యూడో సెక్యులరిజాన్ని వ్యాపింపచేస్తున్నాయని విమర్శించారు. తను ఇటీవల రాసిన 'ఎనిమీస్ వితిన్' పుస్తకంలో కేరళ ఎలా ఇస్లామిక్ ఉగ్రవాదుల హాట్స్పాట్గా మారుతుందనే అంశాన్ని వివరించానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more