ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది పోందిన చార్ ధామ్ లలో ఒక్కటైన కేథార్ నాథ్ ఆలయంలో ఆర్చకులు ఆందోళన పట్టేందుకు సన్నథం అవుతున్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా తాము శాంతియుత పద్దతుల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా స్పందించడం లేదని అరోపిస్తున్న వీరు.. తాజాగా ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశారు. అయితే ఇది సాధారణమైన లేఖలు కాదు.. ఏకంగా అర్చకులు తమ రక్తంతో ఈ లేఖలను రాయడం గమనార్హం.
పరమశివుడు కొలువైవున్న ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామికి రాసిన లేఖలో ఛార్ థామ్ దేవస్థానం బోర్డును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కేదార్ నాథ్ దేవాలయంలోని ధమ్ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు..తీర్థపురోహిత్ సాకేత్ బగ్వాడీ,కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా సమక్షంలో ఆందోళన చేపట్టి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాష్ట్ర సీఎంకు రక్తంతో లేఖలు రాసి తమ నిరసన తెలిపారు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు పురోహితులు. ఇలాగే రక్తంతో లేఖలు రాశారు.
రెండు నెలలుగా..కేదార్నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా అర్చకులు ఆందోళన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసినప్పటినుంచి తమ హక్కులకు భంగం కలుగుతోందన్నారు. బోర్డును రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.దేవస్థానం బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. గత మంగళవారం నుంచి ఉపవాసంతోనే నినాదాలు చేస్తున్నారు. ఈ లేఖలో పురాణ కాలం నుండి కేదార్నాథ్లో యాత్రికుల అర్చకుల హక్కులకు సంబంధించిన అనేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు.
చార్ ధామ్ దేవస్థానం బోర్డు అనాధిగా వస్తున్న ఆచారాలను కాదని, కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేస్తూ.. దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చలా నిర్ణయం తీసుకోకపోతే..ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా, ఆచార్య సంతోష్ త్రివేది, కుబేర్నాథ్ పోస్తి, నితిన్ బగవాడి, ప్రదీప్ శర్మ, సవన్ బాగ్వాడి, ప్రకాశ్ చంద్ర తిన్సౌలా, రమాకాంత్ శర్మలతో పాటు పలువురు యాత్రికులు కూడా పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more