కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతున్న తరుణంలో దానిని సమూలంగా అంతం చేయడానికి పరిశోధనలు కోనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చని అనేక వాక్సీన్లు ప్రజల్లో ప్రతిరక్షకాలను అందిస్తున్నాయి. అయితే కరోనాను అడ్డుకునేందుకు మాత్రం ఇప్పటికీ ఏ టీకా అందుబాటులోకి రాలేదన్న వాదనలూ వున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు అందుబాటులో వున్న టీకాల మిక్సింగ్ కూడా చేసి అధ్యయనం చేస్తున్నారు. ఈ వాక్సీన్ల మిక్సింగ్ ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మన దేశంలోనూ వాక్సీన్ మిక్సింగ్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్).. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) పూణే చేసిన అధ్యయనాలు వెల్లడయ్యాయి. దీంతో ఏకంగా వాక్సీన్ మిక్సింగ్ లపై అధ్యయనం చేయాలని డీజీసిఐ కూడా అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇది అనాలోచిత ఐడియాగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ సైరస్ పూనావాలా అన్నారు. ప్రతిపాదిత కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను ఆయన వ్యతిరేకించారు. డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా పేర్కొన్నారు.
పూణేలోని తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైరస్ పూనావాలా వ్యాక్సిన్ల మిక్సింగ్ గురించి మాట్లాడుతూ.. ఒకవేళా ఏదైనా తప్పు జరిగితే.. ఈ రెండు వ్యాక్సిన్ తయారీదారుల మధ్య తుగువులాట వచ్చే అవకాశముందన్నారు. ఏదైనా అనుకోనిది జరిగితే.. ఇతర వ్యాక్సిన్ మంచిది కాదని సీరం సంస్థ అంటదని.. దీంతో ఇతర వ్యాక్సిన్ కంపెనీ.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ లోనే లోపం ఉందంటూ సీరంపై నిందలు వేస్తారు. కాబట్టి వ్యాక్సిన్ లను మిక్స్ చేయడం చాలా తప్పు అని నేను అనుకుంటున్నా అని సైరస్ పూనావాలా అన్నారు. ఫీల్డ్ ట్రయిల్స్ లో వ్యాక్సిన్ మిక్సింగ్ రుజువు అవ్వలేదని తెలిపారు.
కాగా, భారత్ లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై అధ్యయనానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ సంస్థ) రెండు రోజుల క్రితం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపైఈ అధ్యయనం నిర్వహించనుంది. ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం..వ్యాక్సినేషన్ కోర్సుని పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వగలమా లేదా అని అంచనా వేయడం. కాగా,జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ ఈ అధ్యయ నిర్వహణకు రికమండ్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more