భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ -ఎఫ్10 రాకెట్ ప్రయోగం అంత్యదశలో విఫలమైంది. రాకెట్ ప్రయోగం సాధారణంగానే చోటుచేసుకున్న తరువాత తొలిరెండు దశలు కూడా విజయవంతంగా పూర్తిచేసుకన్న జీఎస్ఎల్వీ.. ఆ తరువాత ప్లేట్స్ కూడా విజయవంతంగా విడిపోయాయి. ఆ తరువాత క్రయోజనిక్ దశలో రాకెట్ లో సమస్య ఎదురైంది. నిర్ధేశిత లక్ష్యం వైపు కాకుండా మరో వైపుకు రాకెట్ దూసుకెళ్లింది. రాకెట్ మార్గం మళ్లించడంతో ఇస్రోలో శాస్త్రవేత్తల ముఖాలలో సంతోషం అవిరైంది. ఎంతో ఘనంగా ఈఓఎస్03 శాటిలైట్ (ఐ ఇన్ ది స్కై)ను నిర్ధేశిత కక్ష్యలో పెట్టాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. రాకెట్ మూడో దశలో సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలమైందని తెలిపారు. జీఎల్ఎల్వీ ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. నెల్లూరులోని శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ మూడో దశలో విఫలమైనట్లు కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆ తర్వాత మిషన్ విఫలమైనట్లు పేర్కొన్నారు. క్రయోజెనిక్ దశలో సమస్యతో ప్రయోగం విజయవంతం కాలేదని మిషన్ కంట్రోల్ సెంటర్లోని రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి రాకెట్ ప్రయోగం గతేడాది లోనే నిర్వహించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి, సాంకేతిక సమస్యలతో పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇస్రో ఈ మిషన్ను చేపట్టింది.
Watch Live: Launch of EOS-03 onboard GSLV-F10 https://t.co/NE3rVjNtHb
— ISRO (@isro) August 11, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more