అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన సింగిల్ డోస్ వాక్సీన్ త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానుంది. ఇదివరకే రష్యాకు చెందిన స్పుట్నిక్-వి సింగిల్ డోసు కరోనా టీకా కోసం రెడ్డి ల్యాబ్స్ సంస్థ కూడా ధరఖాస్తు చేసుకున్నా దానిని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తిరస్కరించింది. కాగా తాజాగా కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది.
ఈ సంస్థ జాన్సెన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ సంస్థ ఇండియాలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండా నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పాత దరఖాస్తును ఉపసంహరించుకున్న జే అండ్ జే సంస్థ.. తాజాగా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది.
అత్యవసర వినియోగం కింద తమ సింగిల్ డోస్ వాక్సీన్ కు అనుమతించాలని కోరుతూ క్రితం రోజునే ధరాఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ఈ మేరకు విషయాన్ని వెల్లడించింది. ఇండియా ప్రజలకు తమ సింగిల్ డోసు వ్యాక్సిన్ అందించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ. లిమిటెడ్ సంస్థతో జే అండ్ జే చేతులు కలిపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నాకు భారత్ అనుమతించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more