అవినీతి అరోపణలపై జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బ్రిటన్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. డెభై ఒక్క ఏళ్ల షరీప్ ప్రధానిగా కొనసాగుతున్న సమయంలోనే అవినీతికి పాల్పడి పదవికి దూరం అయ్యాడు. అతనిపై మోపబడిని అభియోగాలు కూడా రుజువయ్యాయి, దీంతో పాకిస్థాన్ న్యాయస్థానం అతనికి జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా జైలుశిక్ష నుంచి తప్పించుకునేందుకు.. చికిత్స పేరుతో లండన్ లో కాలం వెళ్లదీస్తున్నాడు. కాగా, తన వీసా గడువు పొడిగించాలంటూ నవాజ్ షరీఫ్ ఇటీవల చేసుకున్న దరఖాస్తును యూకే హోంశాఖ తిరస్కరించింది.
అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్.. నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్నారని యూకే హోంశాఖ పేర్కొంది. అంతేకాకుండా నవాజ్ షరీఫ్ వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందే అని యూకే హోంశాఖ స్పష్టం చేసింది. విదేశీయులు బ్రిటన్ లో ఆరు నెలలకు మించి ఉండేందుకు అక్కడి చట్టాలు అనుమతించవు. అయితే ఆరోగ్య కారణాలపై పాక్ ను వీడిన నవాజ్ షరీఫ్… తన వీసాలను అనేక దఫాలుగా పొడిగించుకుంటూ లండన్ లోనే ఉంటున్నారు. అయితే ఈసారి బ్రిటన్ ప్రభుత్వం షరీఫ్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
అయితే యూకే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షరీఫ్ బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేశారు. తనకు అనారోగ్య కారణాల రీత్యా వీసా గడువు పొడిగించాలని అందులో షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసుల్లో నవాజ్ షరీఫ్ ముద్దాయిగా ఉన్నారు. అల్ అజీజియా మిల్స్ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో కొన్నాళ్ల పాటు లాహోర్ జైల్లో కూడా షరీఫ్ ఉన్నారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాననా,వైద్య చికిత్స కోసం బెయిల్ కావాలంటూ.. నవాజ్ షరీఫ్ కోర్టు ఆశ్రయించారు.
దీంతో లాహోర్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో తాను లండన్ వెళ్లేందుకు కూడా అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఆయన లండన్ లోనే చికిత్స పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. అప్పటి నుంచి ఆయన వైద్యం పేరుతో వీసా గడువును పెంచుకుంటూ అక్కడే మకాం వేశారు. అయితే నవాజ్ షరీఫ్ లండన్ వీధుల్లో చలాకీగా తిరుగుతూ, రెస్టారెంట్లలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల బయటికొచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more