చిన్నారులపై లైంగిక దాడి కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు శిక్షను ఎదుర్కోంటున్న ఓ నిందితుడు.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించగా.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బాధిత మహిళ, చిన్నారుల శరీరాన్ని పురుషాంగంతో ఎక్కడ టచ్ చేసినా అది సెక్షన్ 375 కింద అత్యాచారం కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అంగప్రవేశం జరక్కపోయినా అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది.
11 ఏళ్ల మైనర్ బాలికపై ఆరు నెలల క్రితం జరిగిన అత్యాచారం కేసులో కింద కోర్టు నిందితుడ్ని దోషిగా పరిగణించి జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన దోషి.. అంగప్రవేశం జరగనందున దాన్ని అత్యాచారంగా పరిగణించరాదని హైకోర్టును ఆశ్రయించాడు. తన పురుషాంగం బాలిక తొడలకు మాత్రమే తగిలిందని, అది లైంగికదాడి కాదని నిందితుడు పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఆడవారి శరీరంలోని ఏ అవయవంలోకైనా పురుషాంగం చొచ్చుకుపోడానికి చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా సెక్షన్ 375 ప్రకారం అత్యాచారంగానే పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జియాద్ రహ్మాన్లతో కూడి ధర్మాసనం పేర్కొంది. కాగా, సెక్షన్ 375 ప్రకారం కేసులు నమోదు చేశారని, అంగప్రవేశం జరిగితేనే ఇలాంటి కేసులు పెట్టాలని నిందితుడి తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. జననాంగం, మూత్రనాళం, నోరు వంటి వాటినే కాకుండా ఇతర భాగాలపై కూడా పురుషాంగంతో ఎలాంటి దాడి చేసినా అది లైంగిక దాడిగానే పరిగణించాలని సెక్షన్ 375(C) చదివితే తెలుస్తుందని న్యాయవాదికి చురకలు అంటించింది. ఈ విషయంలో న్యాయస్థానాలకు విచక్షణాధికారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. నిందితుడికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more