కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఈ సారి హుజురాబాద్ లో జరుగనున్న ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తనకేనంటూ ప్రచారం చేసుకుని.. పార్టీ క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి.. గత నెల 21న టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేత పాడి కౌశిక్ రెడ్డికి పార్టీ అధిష్టానం అందలాన్ని ఎక్కించింది. హుజూరాబాద్ నుంచి ఎన్నికలలో పోటీకి సై అన్న కౌశిక్ రెడ్డిని పోరాటం నుంచి తప్పించిన టీఆర్ఎస్ అధిష్టానం.. ఆయనను గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపుతూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక రాష్ట్రప్రభుత్వం నిర్ణయంపై గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ లాంచనప్రాయంగా అమోదముద్రం వేయడమే ఆలస్యం.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన తెలంగాణ మంత్రిమండలి పాడి కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేసింది. అయితే మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే కార్యకర్తతో తాను మాట్లాడిన ఆడియో ఫోన్ కాల్ లీక్ కావడంతో.. ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కౌశిక్ రెడ్డి.. ఈ నెల 21న టీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన పది రోజుల వ్యవదిలో ఎమ్మెల్సీ పదవిని అందిపుచ్చుకున్నారు యువనేత.
టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ అభ్యర్థిలో బరిలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావించినా.. అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా మండలికి పంపాలని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో హుజూరాబాద్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ మొదలైంది. టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపి నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఇ పెద్దిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినా.. ఈటెలకు చెక్ పెట్టేందుకు బీసీ వర్గానికి చెందిన వారికే టికెట్ కేటాయిస్తారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more