కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. తెలంగాణకు డెల్టా టెన్షన్ ఇంకా ఉందని.. జనం నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్. తెలంగాణలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని, వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే.. డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది పర్యటించారని ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా.. వరుస పండుగల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. తీవ్రతను పట్టించుకోకుండా కొంత మంది ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు డీహెచ్. కొవిడ్ జాగ్రత్తలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డెల్టా వేరియంట్ గాలి ద్వారా వ్యాపిస్తోందని సంచలన ప్రకటన చేశారు.
ప్రజలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొనరాదని.. మాల్స్కి గుంపులు గుంపులుగా వెళ్లడం సరికాదని తెలిపారు తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి. రాజకీయ నాయకులు కనీసం మాస్క్లు కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు. లక్ష మంది వైద్య సిబ్బంది కరోనా కట్టడి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పటికే వైద్య, పోలీసు, మున్సిపల్ సిబ్బంది అలిసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు డీహెచ్ శ్రీనివాసరావు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more