జమ్మూకశ్మీర్ లో మరోమారు డ్రోన్ సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఏడవ డ్రోెన్ భారత్ లో సంచరించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది, జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగి నెల రోజులు తిరగకముందే.. మరో డ్రోన్ అక్కడికే వచ్చి చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు కొన్ని వందల మీటర్ల దూరంలోకి ఇది చోచ్చుకువచ్చింది. ఈ రోజు తెల్లవారుజామున 4.05 గంటలకు సత్వారీలోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్ కనిపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ కు అతి సమీపంలోనే అది తిరుగాడిందన్నారు.
డ్రోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 27న జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై నిమిషాల వ్యవధిలో డ్రోన్లతో బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో స్టేషన్ పైకప్పు దెబ్బతింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు డ్రోన్లు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఈ డ్రోన్ల దాడులు, సంచారం వెనుక విదేశీ శక్తులే ఉన్నాయని తమ దర్యాప్తులో తేలిందని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే మరోమారు డ్రోన్ ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై సంచరించడం కలకలం రేపుతోంది.
భారత భూభాగంలో సుమారు వందల మీటర్ల ఎత్తులో అది సంచరించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ డ్రోను తిరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గత నెల రోజుల వ్యవధిలో ఇటువంటి డ్రోన్లు కనపడడం ఇది ఏడవసారి. అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత ప్రాదేశిక భూభాగంలోకి డ్రోన్లను పంపేందుకు పదే పదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తుండడంతో భారత సైన్యం రక్షణ చర్యలు తీసుకుంటోంది. అయితే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని భారత అర్మీ వర్గాలు అరోపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more