ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో నిలబడుతున్న సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఓ మహిళకు పరాభవం ఎదురైంది. బీజేపికి చెందిన కొందరు కార్యకర్తలు నడిరోడ్డుపై అమె చీరకొంగు పట్టుకుని లాగి అవమానించారు. అమె చేతిలో బలపర్చే పత్రాలను లాగేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలకు తాము అండగా నిలుస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ మాటలకు ఈ వీడియో సవాల్ గా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... లఖింపూర్ ఖేరీ పరిధిలో పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్ను ప్రతిపాదించడానికి సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ నామినేషన్ కేంద్రానికి వెళుతోంది. ఆ సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ చీర కొంగును పట్టుకుని లాగారు. ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను లాక్కున్నారు. దీంతో ఆమెకు మద్ధతుగా కొందరు ముందుకు వచ్చి విడిపించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎన్నికలో పోటీలో నిలవకుండా చేసి తమ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసుల బలగాలు పనితీరు ఏమో కానీ, ప్రత్యర్థి పార్టీల మహిళా కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తల ఆగడాలు రాష్ట్రంలో శృతిమించిపోయాయని సమాజ్వాదీ పార్టీ నేతలు అరోపిస్తున్నారు. అధికార దాహంతోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చెందిన గూండాలు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మహిళపై దారుణానికి పాల్పడిన ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా విమర్శలు గుప్పించారు. యూపీలో 825 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more