ఈజీ మనీ కోసం అన్వేషణలో దోపిడీలకు అలవాటు పడి జల్సాలు చేస్తున్న దోపిడీ ముఠా.. శివారు ప్రాంతాల్లోని ఒంటరి మహిళలను, వృద్దులను టార్గెట్ చేసి వారిని ఊపిరి ఆడనీయకుండా హతమార్చి.. ఆధారాలు లేకుండా చేసి అక్కడి నుంచి తప్పించుకు తిరిగే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత తొమ్మిది నెలల్లో ఆరుగురిని హత్య చేసిన ఈ ముఠా మరో 12 మందిని టార్గెట్ చేసిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అనూహ్యంగా కటకటలా వెనక్కి నెట్టారు. వంద గొడ్లను తిన్న రాబందు చిన్న గాలివానకు రాలినట్లు.. ఆరు హత్యలు, దోపిడీలు చేసిన ముఠా చిన్న చోరి కేసులో చిక్కింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న విజయవాడ శివారు పోరంకిలోని ఏటీఎంలో కొందరు యువకులు చోరీకి యత్నించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్ చక్రవర్తి అలియాస్ చక్రిని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తాను ఏటీయం చోరికి యత్నించినట్లు అంగీకరించాడు. అయితే అతడికి సహకరించిన మిగతా దొంగలు ఎవరన్న విషయంలో పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించారు. అతడిచ్చిన సమాచారంతో ముఠాలోని మిగిలిన యువకులనూ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వేలిముద్రలను పరిశీలించగా గతేడాది కంచికచర్లలో జరిగిన వృద్ధ దంపతుల హత్యకేసులో నమోదైన నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. దీంతో పోలీసులు తమ శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్, గోపీరాజు, చక్కవర్తి, నాగదుర్గారావు ఆటో డ్రైవర్లు. ఫణీంద్ర కుమార్ పెయింటర్. వ్యసనాలకు బానిసలైన వీరందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉదయం ఆటో నడుపుతూ, కూరగాయలు అమ్ముతూ రెక్కీ నిర్వహించేవారు. ముఖ్యంగా కాలనీలకు దూరంగా ఉంటున్న ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి హత్య చేసి అందినంత దోచుకునేవారు.
గత ఏడాది అక్టోబరులో పోరంకి విష్ణుపురం కాలనీకి చెందిన నళిని (58)ని హత్య చేసి దోచుకున్నారు. అయితే తమ దొంగతనం, హత్య బయటకు రాకపోవడంతో చెలరేగిపోయిన గ్యాంగ్ సభ్యులు.. తొమ్మిది నెలల్లో ఆరుగురిని హత్య చేసి డబ్బు, బంగారు నగలను దోచుకున్నారు. అనంతరం బాధితుల ఇళ్లపై నిఘా పెట్టి.. పోలీసులు వచ్చారా? లేదా అన్న విషయాలు తెలుసుకునేవారు. అంత్యక్రియల వరకు అక్కడే గడిపివారు. మరో 12 మందిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారు. హత్యలు చేసి వారింట్లోని బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను దొంగిలించి వాటిని తాకట్టు పెట్టి జల్సాలు చేసే ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more