Police in search of accused in Seethanagaram Gangrape case సీతానగరం గ్యాంగ్ రేప్: నిందితుల వేటలో ప్రత్యేక బృందాలు

Special police teams in search of accused in seethanagaram gang rape case

woman gang-raped at pushkar ghat krishna river, woman goes with fiancee pushkar ghat, unidentified men gang-rape woman pushkar ghat krishna river, woman gang-raped nursing student, nursing student gangraped, Mechanic girl friend gangraped, Mechanic, nursing student, seethanagaram, Krishna river bank, Vijayawada Police, Andhra Pradesh, Crime

Tha Vijayawada crime branch police are in search for the accused in Seethanagaram Gang Rape case, after the locals say that the main accused Krishna is on the run climbing a good train.

సీతానగరం గ్యాంగ్ రేప్: నిందితుల వేటలో ప్రత్యేక బృందాలు

Posted: 06/24/2021 06:54 PM IST
Special police teams in search of accused in seethanagaram gang rape case

కృష్ణానది సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు కృష్ణ కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడు తన ఇంటి వద్ద రైల్వే ట్రాక్‌ వద్ద ప్రత్యక్షమయ్యాడని,. స్థానికులు కేకలు వేయడంతో గూడ్స్‌ రైలు ఎక్కి పరారయ్యాడని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రైల్వే బ్రిడ్జిపైన కృష్ణ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సీతానగరం కృష్ణానది ఫుష్కారఘాట్ ప్రాంతంలోని ఇసుక తెన్నెలపై కూర్చోని కాబోయే భర్తతో కాస్త సమయం కాలక్షేపం చేద్దామని వచ్చిన నర్సింగ్ విద్యార్థినిపై అమె కాబోయే భర్త కళ్లెదుటే అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల అన్వేషణలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్‌ కృష్ణ, వెంకటేష్ లను  పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి.

ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్‌ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, నర్సింగ్‌ విద్యార్థినికి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రణయంగా మారింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles