మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసక్తి కలిగించే నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు గత ఏడేళ్లుగా సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్ల సంస్థ నూతన చైర్మన్ గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. సత్యా నాదేళ్ల ఎంపిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకుందని పేర్కోంది. బోర్డ్ ఎలక్షన్ లో జాన్ థామ్సన్ స్థానంలో కొత్త చైర్మన్ గా సత్యనాదెళ్లను ఎన్నుకున్నారు. స్టీవ్ బల్లెమర్ నుంచి 2014 ఫిబ్రవరిలో సీఈఓ బాధ్యతలు అందుకున్నారు సత్యనాదెళ్ల. మైక్రోసాఫ్ట్ వ్యాపార సామాజ్రాన్నివిస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.
సీఈఓకు ముందు ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ ప్రైజెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. కంపెనీ కంప్యూటింగ్ ప్లాట్ ఫాంలను నిర్మించడం సహా అనేక రోల్స్ విజయవంతంగా నిర్వర్తించారు. లింక్ డిన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమిక్స్ వంటి సంస్థల కొనుగోలులో నాదెళ్ల కీలకంగా వ్యవహరించారు. ఆపిల్, గూగుల్ నేతృత్వంలోని కొత్త టెక్ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ ను పోటీగా నిలిపారు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన సమయంలో టెక్నాలజీ దిగ్గజం డైనోసార్ అవుతుందని కొందరు భయపడ్డారు.
1975లో స్థాపించిన ఈ సంస్థకు మరింత పవర్ అందించిన ఘనత నాదెళ్లకు దక్కుతుంది. మైక్రోసాఫ్ట్ వచ్చే వారమే తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ న్యూ జనరేషన్ ఆవిష్కరించనుంది. ప్రపంచంలోని డెస్క్ టాప్ కంప్యూటర్లలో దాదాపు మూడొంతుల కంప్యూటర్లకు పవర్ ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 1976 నుంచి బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మైక్రోసాఫ్ట్ మూడో సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచ దిగ్గజ సంస్థలో ఇలాంటి గొప్ప అవకాశం భారతీయుడుకి.. అందులోనూ మన తెలుగువాడికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కడం గర్వించదగిన విషయం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more