car split into two pieces after hitting the culvert ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ముక్కలైన కారు.. అతివేగమేనా.?

Car split into two pieces after hitting the culvert the tragic death of three women on the spot

car broke into two pieces, car got into two pieces, car accident at nagpur road, speeding car lost controll, nagpur medical collage, chhindwara ASP Sanjeev, car accident, wedding ceremony, Ramakona, Chhindwara, collision with bridge, Nagpur Road, Dream Hotel, Bike, Saasar, Madhya Pradesh, crime

The car returned from a wedding ceremony from Ramkona of Chhindwara in MP, collided with a bridge on Friday, which caused three women in the car while two people were seriously injured. The injured has been referred to Nagpur in a serious condition.The accident was so terrible, it can be estimated from the fact that after colliding with a bridge, the car has two pieces.

ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ముక్కలైన కారు.. అతివేగమేనా.?

Posted: 06/17/2021 11:14 AM IST
Car split into two pieces after hitting the culvert the tragic death of three women on the spot

రోడ్డు ప్రమాదాలు అనేకం చూస్తూనే వుంటాం. అయితే ఇది అత్యంత భయంకరమైన ప్రమాదం. బామ్మమాట బంగారు బాట చిత్రం క్లైమాక్స్ సీన్ లో హీరో, తన తాతతో కలసి ప్రయాణించే కారు రెండు భాగాలుగా విడిపోయి మళ్లీ ఒక్కటవుతుంది. సరిగ్గా అలాగే మధ్యప్రదేశ్ లోని ఓ వివాహ వేడుకకు వచ్చన బంధువులు తిరుగు ప్రయాణంలో అతివేగంగా నడిపిస్తూ.. బ్రిడ్జిని ఢీకోన్నారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా ఇద్దరు క్షతగాత్రులను నాగపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. మధ్యప్రదేశ్ లోని రామకోనలో గల ఓ వివాహ కార్యక్రమానికి సౌస్సర్ కు చెందిన సచిన్ జైస్వాల్ తన కుటుంబంతో పాటు బంధువులతో కలసి బయలుదేరి వెళ్లారు. అక్కడ విహాహం అయిన తరువాత సచిన్ జైస్వాల్ కుటుంబం.. బందువులతో పాటు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో నాగ్ పూర్ రోడ్డులోకి చేరువవుతున్న క్రమంలో సరిగ్గా డ్రీమ్ లాండ్ హోటల్ సమీపంలో వారికి ఓ బైక్ అడ్డుగా వచ్చింది. అయితే అప్పటికే అతివేగంగా దూసుకెళ్తున్న కారు.. బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి ఎదురుగా ఉన్న కల్వర్టు బ్రిడ్జిని ఢీకొన్నింది.

కారు ఒక్క ఉదుటున బ్రిడ్జిని ఢీకొనడంతో.. కారు ఏకంగా రెండు ముఖ్కలైంది. కారు ముందుబాగం, వెనుక బాగం.. రెండు టైర్లతో సహా రెండు ముక్కలుగా మారాయి. దీనిని బట్టి కారు ఎంత వేగంతో వస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో సౌస్సర్ నివాసస్థులైన  అనుప్ జైస్వాల్, ఆనంద్ జైస్వాల్ భార్య మాధురి, కమేశ్వర్ నివాసస్థులైన సచిన్ జైస్వాల్ భార్య ప్రియ అక్కడికక్కడే మరణించారు. కాగా కారును నడుపుతున్న సచిన్ జైస్వాల్, సప్హిత్ జైస్వాల్ లకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని నాగపూర్ మెడికల్ కాలేజీ అసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles