రోడ్డు ప్రమాదాలు అనేకం చూస్తూనే వుంటాం. అయితే ఇది అత్యంత భయంకరమైన ప్రమాదం. బామ్మమాట బంగారు బాట చిత్రం క్లైమాక్స్ సీన్ లో హీరో, తన తాతతో కలసి ప్రయాణించే కారు రెండు భాగాలుగా విడిపోయి మళ్లీ ఒక్కటవుతుంది. సరిగ్గా అలాగే మధ్యప్రదేశ్ లోని ఓ వివాహ వేడుకకు వచ్చన బంధువులు తిరుగు ప్రయాణంలో అతివేగంగా నడిపిస్తూ.. బ్రిడ్జిని ఢీకోన్నారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా ఇద్దరు క్షతగాత్రులను నాగపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. మధ్యప్రదేశ్ లోని రామకోనలో గల ఓ వివాహ కార్యక్రమానికి సౌస్సర్ కు చెందిన సచిన్ జైస్వాల్ తన కుటుంబంతో పాటు బంధువులతో కలసి బయలుదేరి వెళ్లారు. అక్కడ విహాహం అయిన తరువాత సచిన్ జైస్వాల్ కుటుంబం.. బందువులతో పాటు తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో నాగ్ పూర్ రోడ్డులోకి చేరువవుతున్న క్రమంలో సరిగ్గా డ్రీమ్ లాండ్ హోటల్ సమీపంలో వారికి ఓ బైక్ అడ్డుగా వచ్చింది. అయితే అప్పటికే అతివేగంగా దూసుకెళ్తున్న కారు.. బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి ఎదురుగా ఉన్న కల్వర్టు బ్రిడ్జిని ఢీకొన్నింది.
కారు ఒక్క ఉదుటున బ్రిడ్జిని ఢీకొనడంతో.. కారు ఏకంగా రెండు ముఖ్కలైంది. కారు ముందుబాగం, వెనుక బాగం.. రెండు టైర్లతో సహా రెండు ముక్కలుగా మారాయి. దీనిని బట్టి కారు ఎంత వేగంతో వస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో సౌస్సర్ నివాసస్థులైన అనుప్ జైస్వాల్, ఆనంద్ జైస్వాల్ భార్య మాధురి, కమేశ్వర్ నివాసస్థులైన సచిన్ జైస్వాల్ భార్య ప్రియ అక్కడికక్కడే మరణించారు. కాగా కారును నడుపుతున్న సచిన్ జైస్వాల్, సప్హిత్ జైస్వాల్ లకు మాత్రం తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని నాగపూర్ మెడికల్ కాలేజీ అసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more