పశ్చిమ బెంగాల్లో భీకరంగా కురిసిన వరుణుడు 26 మందిని బలతీసుకున్నాడు. వర్షానికి తోడు తీవ్రమైన గాలులు దక్షిణ బెంగాల్ లో బీభత్సం సృష్టించాయి. వీటికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బెంగాల్ లోని దక్షిణ బాగంలోని పలు జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. అకస్మాత్తుగా కురిసిన ఈ వానలకు 26 మంది చనిపోయినట్టు రాష్ట్ర విపత్తు నివారణా అధికారులు తెలిపారు. ఇది వరకే యాస్ తుఫాను మిగిల్చిన విషాదాలు, పెను నష్టాలను మర్చిపోని బెంగాల్ వాసులపై మరోమారు వరుణుడు తన ఉగ్రరూపంతో విరుచుకుపడ్డాడు.
హూగ్లీలో ఏకంగా పదకొండు మంది, ముర్షీదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్, బంకురా జిల్లాలో ఇద్దరు చోప్పున పిడుగులు పడి చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ బెంగాల్ లో వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ఏకంగా 26 మంది మరణించారు. రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసిందా అన్నట్లుగా విషాదం అలుముకుంది. రాష్ట్రంలోని పూర్బ మెదినిపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్ కత్తా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నాడియా జిల్లాలో పిడుగులు పడ్డాయి.
పశ్చిమ బెంగాల్ లో వర్షాలకు 26 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రళయంలో భాగంగా తమ వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రాధిస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చోప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి అమిత్ షా కూడా సంతాపం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more