కరోనా వైరస్ పుట్టుక రహస్యాన్ని ఛేదించేందుకు దాని మూలాలపై లోతుగా పరిశోధన జరపాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. కరోనా మూలాలను కనుగొనాలని ప్రపంచంలోని చాలా దేశాల నుంచి మరోసారి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బ్లింకెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కరోనా మూలాలను కనుగొంటే మరో మహమ్మారి రాకుండా నివారించగలుగుతామని, కనీసం దాని తీవ్రతనైనా తగ్గించవచ్చని అన్నారు. ఈ ముఖ్య కారణాల వల్లే తాము కరోనా మూలాలను కనుక్కోవాలని చెబుతున్నామని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ మూలాలను కనుగొనే విషయంలో జో బైడెన్ ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందని ఆంటోనీ బ్లింకెన్ వివరించారు. కరోనా పుట్టుక గురించి తాము అడుగుతోన్న విషయాలపై చైనా పారదర్శక సమాచారాన్ని ఇవ్వట్లేదని చెప్పారు. కరోనాకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని చైనా ఇవ్వాలని ఆయన అన్నారు. కరోనా పుట్టుక గురించి పరిశోధనలు జరిపేందుకు వచ్చేందుకు ప్రపంచ నిపుణులకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తిపై చైనాను జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కాగా, కరోనా వైరస్ను చైనాలోని వూహాన్ ల్యాబ్లోనే సృష్టించారని మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలోని పలు దేశాల పరిశోధకులు చేసిన పరిశోధనలు కూడా ఇవే చెబుతుండడంతో అమెరికా ఈ అంశాన్ని మరోసారి సీరియస్గా తీసుకుంటోంది. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా మాట్లాడుతూ... కరోనా వూహాన్ ల్యాబ్ నుంచే అది లీక్ అయిందని, ల్యాబ్లో శాస్త్రవేత్తలే సృష్టించారని ఇటీవల పలు అధ్యయనాలు చెప్పిన విషయాలను గుర్తు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి కారణమైన చైనా భారీగా జరిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో కరోనా పుట్టుక గురించి తాను చెప్పింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more