ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తన రూపాన్ని బదలాయిస్తూ ఒకటో దశ, రెండో దశ ప్రభావాలను మార్చుకుంది. ఇక త్వరలో మూడవ దశగా కూడా రూపాన్ని మార్చకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రజలు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇప్పట్నుంచే జాగ్రత్త పడతున్నారు. ఈ క్రమంలో రెండవ దశలో కరోనా బారిన పడిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తోందీ మహమ్మారి. దీని నుంచి కోలుకున్న తర్వాత కూడా వివిధ రూపాల్లో వేధిస్తోంది. కరోనా బారి నుంచి కోలుకున్న తర్వాత వేధిస్తున్న పలు సమస్యలలో ఇప్పుడు హెర్పిస్ ఇన్ఫెక్షన్ కూడా చేరింది.
కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఇది తిరగబెడుతోంది. ఫలితంగా జట్టు రాలిపోవడం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, పెదవి చుట్టూ పొక్కులు వంటివి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారు, క్వారంటైన్ లో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది హెర్పిస్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారని పేర్కొన్నారు. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్వీ) వల్ల హెర్పిస్ లేబియాలిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది క్రమంగా హెచ్ఎస్వీ-1 లేదంటే హెచ్ఎస్వీ-2కు దారితీసే అవకాశం ఉంది.
అదే జరిగితే పెదవి చుట్టూ నీటిపొక్కులు రావడంతోపాటు నొప్పి కూడా ఉంటుంది. కొవిడ్ బాధితుల్లో హెచ్ఎస్వీ కంటే హెర్పిస్ జోస్టర్ కేసులే ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిసెల్లా-జోస్టర్ వైరస్ మళ్లీ యాక్టివేట్ అయి హెర్పిస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. ఫలితంగా చర్మంపై చెల్ది పొక్కులు వస్తాయని చెబుతున్నారు. అలాగే, క్యాండిడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మర్మాయవవాల వద్ద తెల్లటి పొక్కులు వస్తుంటాయి. గోళ్లపై గోధుమ రంగులో గీతలు రావడం, మహిళల్లో జుట్టు రాలిపోవడం, నుదురు, వీపుపై మచ్చలు రావడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏదైనా లక్షణం కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more