PM announces free vaccine for all పద్దెనిమిదేళ్లు దాటిన ప్రజలందరికీ ఉచిత వాక్సీన్: ప్రధాని మోడీ

Government will revert to centralised procurement of vaccines says modi

pm modi, pm modi address to nation, pm modi address to nation today, pm modi corona vaccine, pm modi speech, pm modi speech today, pm narendra modi , modi, modi vaccine, modi corona vaccine speech, modi today speech, pm modi news, covid 19, coronavirus, coronavirus in india, coronavirus india, coronavirus pm modi, pm narendra modi live, modi live today, modi speech today, coronavirus latest update

In his address to the nation, Prime Minister Narendra Modi Monday announced a centralised Covid-19 vaccine policy. “Twenty-five per cent of the vaccination work with states will now be handled by the Centre, it will be implemented in the coming two weeks. Both State and Centre will work as per new guidelines in the coming two weeks,” Modi said.

పద్దెనిమిదేళ్లు దాటిన ప్రజలందరికీ ఉచిత వాక్సీన్: ప్రధాని మోడీ

Posted: 06/07/2021 06:13 PM IST
Government will revert to centralised procurement of vaccines says modi

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టు మోడీ తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుంది. వ్యాక్సిన్ కేంద్రాల నుంచి కేంద్రమే కొని రాష్ట్రాలకు అందిస్తుంది. వ్యాక్సిన్ కోసం ఏ రాష్ట్రం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మోడీ పేర్కొన్నారు. ఉచిత టీకా వద్దనుకుంటే ప్రైవేట్ లో వేయించుకోవచ్చని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలు 150 సర్వీస్ ఛార్జీలతో అందిచాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ ఉద్దృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొనసాగిన వ్యాప్తి కాసింత తగ్గుముఖం పట్టింది. దీంతో తాజాగా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పేదలకు అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకు అందిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. నవంబర్ వరకు దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామన్నారు.

అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి 80శాతం మంది ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్, అదేవిధంగా థర్డ్ వేవ్ ముప్పును అధిగమించే అంశంపై కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించడమే మనకు రక్ష. వ్యాక్సిన్‌ తయారీలో మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు అని మోదీ అన్నారు.  దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ.. 75శాతం రాష్ట్రాలుకు అందించనుండగా, 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles