సాధారణంగా మామిడి పండ్ల ధర కిలో రూ.50 నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. కానీ కొన్ని రకాల మామిడి పండ్లకు మాత్రం భలే గిరాకీ వుంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక్క కిలో మామిడి పండ్లు ఏకంగా వెయ్యి రూపాయల ధర పలుకుతాయంటే నమ్మకం కలగడం లేదా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇలాంటి కొన్ని రకాల మామిడి పండ్ల రకాలలో ‘నూర్జహాన్’ మామిడి పండ్లు కూడా ఒక రకం. వీటికి సాధారణ మామిడి పండ్లకు చాలా తేడాలు వుంటాయి. అందుకనే ఇవి ప్రత్యేకం. ప్రస్తుతం వీటి ధర ఒక్కోటి గరిష్ఠంగా రూ.1,000కి అమ్ముడుపోతోంది.
ఔనా.. నిజమేనా అంటారా.. మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ జిల్లాలోని మామిడి తోటల్లో ‘నూర్జహాన్’ మామిడి కాయలు కాశాయి. కోవిడ్ ఆంక్షలు, లాక్ డౌన్ నిర్ణయాలతో వాటిని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మె అవకాశం లేకపోవడంతో రైతులు కూడా విభిన్నంగా ఆన్ లైన్ బాట పట్టారు. తమ నూర్జహాన్ మామిడి పండ్లను నెట్టింట్లో అమ్మకానికి పెట్టారు. వాటి ధర ఒక్కోటి రూ.500 నుంచి రూ.1,000 మధ్య ఉంది. తన తోటలోని మూడు నూర్జహాన్ చెట్లకు 250 మామిడి కాయలు కాశాయని అక్కడి రైతు చెప్పాడు. ఈ పండ్లన్నీ ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల వారు బుక్ చేసుకున్నారని తెలిపాడు.
ఈ సారి ఒక్కో నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉందని అన్నాడు. కాగా, 2019లో నూర్జహాన్ మామిడి గరిష్ఠంగా ఒక్కోటి రూ.1,200కి అమ్ముడుపోయింది. ఒక్కో మామిడి పండు అంత గరిష్ఠ ధరకి అమ్ముడు పోవడం అదే తొలిసారి. ఈ మామిడి పండ్లను పండించే అక్కడి తోటల్లో గత ఏడాది సానుకూల వాతావరణం లేకపోవడంతో అప్పట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మరో రైతు చెప్పాడు. ఈ సారి మాత్రం పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయని వివరించాడు. ఆఫ్ఘన్ మూలాలకు చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే పండిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more