నారదా కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులతో పాటు ఓ ఎమ్మెల్యే. మరో మాజీ మంత్రిని అరెస్టు చేసిన సీబిఐ.. తాజాగా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న బీజేపి నేత సువేందు అధికారిని విచారించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఆయనను విచారించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. నారద స్టింగ్ ఆపరేషన్ జరిగిన సమయంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఈ కేసులు అభియోగాలు ఎదుర్కోంటున్న ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యే, సీనియర్ నేతను అరెస్టు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో అరెస్టు చేయగా.. అదే రోజన సాయంత్రం సిబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఈ కేసులో స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా పలువురి నేతల అరెస్టులు జరిగడంపై హర్షం వ్యక్తం చేసిన నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మాథ్యూ సామ్యూల్.. ఈ కేసులో ఇంకా పెద్దవాళ్లను అనేక మందిని వదిలేశారని అన్నారు. తాను గతంలో నిర్వహించిన స్టింగ్ అపరేషన్ లో జరిగిన అరెస్టులు.. సముద్రంలో ఓ బింధువు మాత్రమేనని అన్నారు. ఈ కేసులో ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపిలో చేరిన సువేందు అధికారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 2016లో తన స్టింగ్ ఆపరేషన్ టేపులు విడుదల అయ్యాయని, అయితే అందులో చిక్కకున్న రాజకీయ నాయకులపై మూడేళ్ల క్రితమే చార్జిషీటు దాఖలైనా ఇప్పటివరకు సీబిఐ వారిని ముట్టుకోలేదని పేర్కొన్నారు.
నారద స్టింగ్ అపరేషన్ లో చిక్కుకున్న టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం వేచిన సీబిఐ.. తాజాగా లోక్ సభ స్పీకర్ అనుమతి కోసం ఎందుకు వచిచూస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ అరెస్టుల నేపథ్యంలో టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ, సువేందు అధికారి, ముకుల్ రాయ్ లు బీజేపీలో చేరడంతో సీబీఐ వారిని విచారించడం లేదని ఆరోపించారు. అయితే తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అసలైన దోషులు త్వరలోనే బయటపడతారని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ మండిపడ్డారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ ను నారద న్యూస్ పోర్టల్ ఎడిటర్ మ్యాథ్యూ శామ్యూల్ నిర్వహించారు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన విషయాలపై విచారణ జరపాలని 2017 మార్చిలో సీబీఐని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. తాజాగా శామ్యూల్ మాట్లాడుతూ, కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more