కామా తురానాం నభయం నలజ్జ అన్న నానుడిని ఈ మిఠాయి దుకాణం యజమాని విషయంలో నిజమని చెప్పక తప్పదు. తల్లిదండ్రులకు అండగా వుండేందుకు.. ఓ స్వీటు షాపులో పనికి కుదిరిన ఇంజనీరింగ్ విద్యార్థినిని తన తోబుట్టువో లేక కూతురో అని పని కల్పించాడని భావించిన ఆ యువతికి తన యజమాని కపట బుద్ది గ్రహించలేకపోయింది. తనను సాయం చేయాలన్న బుద్దితో యజమాని తనకు అండగా నిలువలేదని, తనపై వున్న వాంఛతోనే తనకు ఉపాధి కల్పించాడని అఘాయిత్యం తరువాత కానీ బోధపడలేదు. నీచులు, నికృష్టులు, కామాంధులు అదను చూసి కాటు వేస్తారని తెలిసినా.. అనునిత్యం సవాళ్లను ఎదుర్కోంటునే వుంది మహిళా సమాజం.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లే.. తల్లిదండ్రులకు భారంగా వుండటం కన్నా ఏదో ఒక పనిచేసి వారికి చేదోడుగా వుండవచ్చునని భావించిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని.. స్థానికంగా వున్న ఓ స్వీట్స్ షాప్ లో పనికి కుదిరింది. రెండోదశ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలతో పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఓ స్వీటు దుకాణంలో పనికి కుదిరింది. రూ.5 వేల జీతం ఇస్తానని యజమాని చెప్పడంతో సంతోషంగా విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పిన యువతి.. అప్పటి నుంచి ప్రతి రోజు దుకాణానికి వచ్చి.. పనిచేసుకుంటోంది.
అయితే షాపులో గిరాకీ లేని సమయంలో యువతిపై కన్నేసిన యజమాని దుకాణంలో పనిచేస్తున్న విద్యార్థినికి కూల్ డ్రింక్ ఇచ్చాడు. అయితే అమెకు తెలియకుండానే అందులో మత్తు మందు కలిపాడు. అది తాగిన తరువాత అమె లో మత్తులోకి జారుకోగా, విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడైంది. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more