ponnur sweet shop owner molested engineering student ఇంజనీరింగ్ విద్యార్థినిపై గుంటూరులో అఘాయిత్యం..

Engineering student molested by sweet shop owner in guntur of ap

Engineering student sexual assault, sweet shop owner assaulted engineering student, ponnur sweet shop owner assaulted young girl, Engineering student, sweet shop, unconscious, parttime worker, sexual assault, molestation, rape, ponnur, Guntur, Andhra Pradesh. crime

An engineering student was allegedly sexually assaulted by an Sweet Shop owner in the shop, who is working part-time in the shop in ponnur town in Guntur District of Andhra Pradesh. The shop owner offered her a cool drink in which he added tablets by which she fell unconscious, With the girl's parents complaint ponnur police filed FIR.

ఇంజనీరింగ్ విద్యార్థినిపై గుంటూరులో అఘాయిత్యం..

Posted: 05/19/2021 01:01 PM IST
Engineering student molested by sweet shop owner in guntur of ap

కామా తురానాం నభయం నలజ్జ అన్న నానుడిని ఈ మిఠాయి దుకాణం యజమాని విషయంలో నిజమని చెప్పక తప్పదు. తల్లిదండ్రులకు అండగా వుండేందుకు.. ఓ స్వీటు షాపులో పనికి కుదిరిన ఇంజనీరింగ్ విద్యార్థినిని తన తోబుట్టువో లేక కూతురో అని పని కల్పించాడని భావించిన ఆ యువతికి తన యజమాని కపట బుద్ది గ్రహించలేకపోయింది. తనను సాయం చేయాలన్న బుద్దితో యజమాని తనకు అండగా నిలువలేదని, తనపై వున్న వాంఛతోనే తనకు ఉపాధి కల్పించాడని అఘాయిత్యం తరువాత కానీ బోధపడలేదు. నీచులు, నికృష్టులు, కామాంధులు అదను చూసి కాటు వేస్తారని తెలిసినా.. అనునిత్యం సవాళ్లను ఎదుర్కోంటునే వుంది మహిళా సమాజం.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్లే.. తల్లిదండ్రులకు భారంగా వుండటం కన్నా ఏదో ఒక పనిచేసి వారికి చేదోడుగా వుండవచ్చునని భావించిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని.. స్థానికంగా వున్న ఓ స్వీట్స్ షాప్ లో పనికి కుదిరింది. రెండోదశ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలతో పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఓ స్వీటు దుకాణంలో పనికి కుదిరింది. రూ.5 వేల జీతం ఇస్తానని యజమాని చెప్పడంతో సంతోషంగా విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పిన యువతి.. అప్పటి నుంచి ప్రతి రోజు దుకాణానికి వచ్చి.. పనిచేసుకుంటోంది.  

అయితే షాపులో గిరాకీ లేని సమయంలో యువతిపై కన్నేసిన యజమాని దుకాణంలో పనిచేస్తున్న విద్యార్థినికి కూల్ డ్రింక్ ఇచ్చాడు. అయితే అమెకు తెలియకుండానే అందులో మత్తు మందు కలిపాడు. అది తాగిన తరువాత అమె లో మత్తులోకి జారుకోగా, విద్యార్థినిపై  అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడైంది. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఇంజినీరింగ్‌ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles