కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనాతో కాకవికళమైన దేశప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వ్యాపారం ధోరణితో వ్యవహరిస్తూ వారిని అంతంపాతాళానికి దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అంటే ట్విట్టర్ వేదికగా కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే ‘బర్డన్ జనతా పార్టీ’ అంటూ ట్విట్టర్ వేదికగా కొత్త నిర్వచనం చెబుతూ ఎద్దేవా చేశారు. ధరఘాతాన్ని ప్రజల నెత్తిన పెట్టి ధరలను ఆకాశాన్ని తాకేలా పెంచుతూపోతున్న పార్టీ బీజేపి అని దుయ్యబట్టారు.
ధరల బరువును ప్రజల నెత్తిన పెట్టి భరించాలని మోయిస్తున్న పార్టీ బీజేపి అని ఆయన నిర్వచనం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తమ ట్విట్టర్ వేదికగా ధరాఘాతంపై యుద్దాన్ని ప్రకటించారు. దేశంలోని ప్రజలందరూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలపై తమ ధరాఘాత ఉద్యమానికి మద్దుతు ఇవ్వాలని కోరారు. త్వరలోనే తాము బీజేపీ నాయకులు దోచుకున్న ప్రజాధనం వివరాలపై మాట్లాడతామన్న ఆయన.. ఈ అవినీతికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని సూచించారు.
దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, బీజేపీ దోచుకున్న దానిని అందరూ ప్రశ్నించాలని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి’ అని ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల అనేది ఓ శాపమని, పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన అభ్యర్థించారు. దీంతో పాటు పెరిగిన పెట్రోధలకు సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more