కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనాతో కాకవికళమైన దేశప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వ్యాపారం ధోరణితో వ్యవహరిస్తూ వారిని అంతంపాతాళానికి దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అంటే ట్విట్టర్ వేదికగా కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే ‘బర్డన్ జనతా పార్టీ’ అంటూ ట్విట్టర్ వేదికగా కొత్త నిర్వచనం చెబుతూ ఎద్దేవా చేశారు. ధరఘాతాన్ని ప్రజల నెత్తిన పెట్టి ధరలను ఆకాశాన్ని తాకేలా పెంచుతూపోతున్న పార్టీ బీజేపి అని దుయ్యబట్టారు.
ధరల బరువును ప్రజల నెత్తిన పెట్టి భరించాలని మోయిస్తున్న పార్టీ బీజేపి అని ఆయన నిర్వచనం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తమ ట్విట్టర్ వేదికగా ధరాఘాతంపై యుద్దాన్ని ప్రకటించారు. దేశంలోని ప్రజలందరూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలపై తమ ధరాఘాత ఉద్యమానికి మద్దుతు ఇవ్వాలని కోరారు. త్వరలోనే తాము బీజేపీ నాయకులు దోచుకున్న ప్రజాధనం వివరాలపై మాట్లాడతామన్న ఆయన.. ఈ అవినీతికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని సూచించారు.
దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, బీజేపీ దోచుకున్న దానిని అందరూ ప్రశ్నించాలని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి’ అని ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల అనేది ఓ శాపమని, పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన అభ్యర్థించారు. దీంతో పాటు పెరిగిన పెట్రోధలకు సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more