బంగారు నగల వ్యాపారితో పాటు ఆయన దుకాణానికి కాపలాగా ఉన్న ఓ కుక్కను నెట్ జనులు తిట్టిపోస్తున్నారు. నీ పని నువ్వు చేయకండా.. నీ జాతి కుక్కలకే అవమానాన్ని ఆపాదించిపెట్టావు అంటూ నెటిజనులు మండిపడుతున్నారు. ఎందుకలా అంటే ఆ కుక్క కాపాలాగా వున్న బంగారు ఆభరణాల దుకాణంలో దొంగ పడి.. బంగారాన్ని మూటకట్టుకుని దోచుకెళ్తుంటే.. అ దుకాణంలోనే ఓ పక్కగా వున్న శునంక దొంగను చూసి అరవటం.. మరో అడుగు ముందకసీ దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడాల్సింది పోయి.. గురకలు పెట్టి నిద్రపోయింది.
వివరాల్లోకి వెళితే.. థాయ్లాండ్, చియాంగ్ మాయ్ సిటీలోని ఓ బంగారం షాపులోకి నెత్తిన నల్ల టోపీ, మూతికి మాస్క్తో ఓ దొంగ చొరబడ్డాడు. యజమానికి గన్ను చూపించి, బెదిరించి బంగారు నగలున్న సంచిని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే షాపునకు కాపలాగా ఉన్న కుక్క మాత్రం ఇదేమీ పట్టనట్లు గురకపెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ దొంగ మళ్లీ షాపు దగ్గరకు వచ్చాడు. జరిగిందంతా ఓ నకిలీ దొంగతనమని, షాపుల్లోని భద్రతను పరీక్షించటానికి పోలీసులు ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్లో భాగంగా దొంగతనానికి వచ్చానని చెప్పాడు.
దీంతో ఒకవేళ షాపులో నిజమైన దొంగతనం జరిగినప్పుడైనా కుక్క మేలుకుంటుందా అని పోలీసు దుకాణ యజమానిని ప్రశ్నించాడు. షాపు యజమాని దీనికి సమాధానం ఇస్తూ.. ‘‘ నిజం చెప్పమంటారా?.. నా ఉద్ధేశ్యంలో మా కుక్క మనుషుల భాషను అర్థం చేసుకుందని అనుకుంటున్నా. అది ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటుంది. నేను ఏ చిన్న శబ్ధం చేసినా ఊరుకోదు. మీరు సీసీటీవీ కెమెరాల్లో నా హావభావాలను గమనించండి. నేనేమైనా శబ్ధం చేశానేమో చూడండి! అది ఫేక్ అని నాకు తెలిసిపోయింది కాబట్టే నేను ఊరికే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
నిజమైన దొంగలు దుకాణంలోకి ప్రవేశించిన తీరు..వారు పడే కంగారు మీలో కనబడలేదని పోలీసుకు సూచించిన దుకాణ యజమాణి.. ఇక తన కుక్కను ఏవ్వరూ ఏమనకుండా వెనకోసుకువచ్చాడు. అయితే దొంగ వేషంలో వచ్చిన పోలీసుకు ఆ కుక్క అంతకు ముందే తెలుసునని, చాలా సార్లు కలుసుకున్నారని షాపు యజమాని చెప్పాడు. ఏది ఏమైనా కుక్క అలా గుర్రుపెట్టి నిద్రపోవటంపై నెటిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ తెలిసిన వ్యక్తులు షాపును దోచుకుపోతే చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ‘‘ షాపులో దొంగ పడితే అలా గురకపెట్టి నిద్రపోతావా.. సిగ్గులేదు?’’ అంటూ మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more