అత్యంత శక్తివంతమైన దేశ ద్రోహ చట్టం వినియోగంపై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అతిశక్తివంతమైన ఈ చట్టాన్ని దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వినియోగించాలే తప్ప.. ప్రభుత్వం, పోలీసుల తప్పులను ఎత్తిచూపుతున్న వారి గొంతు నొక్కడానికి కాదని వ్యాఖ్యానించింది. సమాజంలో తమను ఎదురించే వారందరిపై ఈ చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేయడం మంచిది కాదని హితవు పలికింది. దుండగుల ముసుగులో ఆ చట్టం ప్రయోగించడం సహేతుకం కాదని పేర్కోంది. దేశద్రోహం చట్టాన్ని పేర్కోని పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు.. తమకు బెయిలు మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.
ఢి్ల్లీ శివారల్లో వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి మద్దతుగా దేవీ లాల్ బర్దక్, స్వరూప్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేస్తున్నారని, ఫేక్ వీడియోలు సృష్టించి పోస్ట్ చేస్తున్నారని పేర్కొంటూ పోలీసులు వారిద్దరిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు నమోదు చేసిన కేసులపై పోరాడుతున్న వీరిద్దరూ తమకు బెయిలు మంజూరు చేయాలని ఢిల్లీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి వ్యాజ్యాన్ని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా విచారించారు.
సాగు చట్టాల ఆందోళనలకు సంబంధించి హింసను ప్రేరేపించేందుకు వారు ప్రయత్నించారని చె్ప్పడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాల్లేవని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్న పోలీసుల వాదనలకు సరైన ఆధారాలను కూడా చూపించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాబట్టి వారిపై దేశద్రోహ చట్టాన్ని తప్పుగా ప్రయోగించారన్న అనుమానం కలుగుతోంది. వారిద్దరి మీదా తప్పుడు కేసులు బనాయించినట్టు అర్థమవుతోందని పేర్కోంది. ఈ కేసుపై లోతైన చర్చ జరగాలన్నది తన అభిప్రాయంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
రైతు ఉద్యమానికి మద్దతుగా 200 మంది పోలీసులు రాజీనామా చేశారంటూ ఓ వీడియోను వారిద్దరూ పోస్ట్ చేశారని, వాస్తవానికి పరిస్థితులను ఎలా డీల్ చేయాలో సిబ్బందికి ఆ వీడియోలో పోలీస్ అధికారి సూచిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే, దానికి స్పందించిన జడ్జి.. తానే స్వయంగా కోర్టు రూములో ఆ వీడియో చూశానన్నారు. అందులో రైతులకు అనుకూలంగా ఆ పోలీస్ అధికారి నినాదాలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అక్కడి వాతావరణం కూడా అలాగే ఉందన్నారు. అయితే, ఆ వీడియోను ఒరిజినల్ గా పోస్ట్ చేసింది నిందితులు కాదని, కేవలం ఫార్వర్డ్ మాత్రమే చేశారని దర్యాప్తులో తేలినట్టు గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more