Sedition can’t be used to quieten disquiet: Delhi court observes గొంతునొక్కడానికి దేశద్రోహ చట్టమా.? ఢిల్లీ హైకోర్టు అసహనం

Sedition law can t be used to quieten the disquiet delhi court in farmers protest related case

dissent, Farm laws, farmers protest, sedition law, Delhi court, Judge Dharmender Rana, Devi Lal Burdak, Swaroop Ramtop, Delhi Police, crime

A Delhi court has said that the law of sedition cannot be invoked to quieten the disquiet under the pretence of muzzling the miscreants. Additional Sessions Judge Dharmender Rana made the observation while granting bail to two persons – Devi Lal Burdak and Swaroop Ram – arrested by the Delhi Police earlier this month for allegedly posting a fake video on Facebook during the ongoing farmers’ protest.

లా అండ్ ఆర్డర్ కోసమే దేశద్రోహ చట్టం.. గొంతునొక్కడానికి కాదు: ఢిల్లీ హైకోర్టు

Posted: 02/17/2021 12:26 PM IST
Sedition law can t be used to quieten the disquiet delhi court in farmers protest related case

అత్యంత శక్తివంతమైన దేశ ద్రోహ చట్టం వినియోగంపై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అతిశక్తివంతమైన ఈ చట్టాన్ని దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వినియోగించాలే తప్ప.. ప్రభుత్వం, పోలీసుల తప్పులను ఎత్తిచూపుతున్న వారి గొంతు నొక్కడానికి కాదని వ్యాఖ్యానించింది. సమాజంలో తమను ఎదురించే వారందరిపై ఈ చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేయడం మంచిది కాదని హితవు పలికింది. దుండగుల ముసుగులో ఆ చట్టం ప్రయోగించడం సహేతుకం కాదని పేర్కోంది. దేశద్రోహం చట్టాన్ని పేర్కోని పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు.. తమకు బెయిలు మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.

ఢి్ల్లీ శివారల్లో వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి మద్దతుగా దేవీ లాల్ బర్దక్, స్వరూప్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేస్తున్నారని, ఫేక్ వీడియోలు సృష్టించి పోస్ట్ చేస్తున్నారని పేర్కొంటూ పోలీసులు వారిద్దరిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు నమోదు చేసిన కేసులపై పోరాడుతున్న వీరిద్దరూ తమకు బెయిలు మంజూరు చేయాలని ఢిల్లీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి వ్యాజ్యాన్ని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా విచారించారు.

సాగు చట్టాల ఆందోళనలకు సంబంధించి హింసను ప్రేరేపించేందుకు వారు ప్రయత్నించారని చె్ప్పడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాల్లేవని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్న పోలీసుల వాదనలకు సరైన ఆధారాలను కూడా చూపించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాబట్టి వారిపై దేశద్రోహ చట్టాన్ని తప్పుగా ప్రయోగించారన్న అనుమానం కలుగుతోంది. వారిద్దరి మీదా తప్పుడు కేసులు బనాయించినట్టు అర్థమవుతోందని పేర్కోంది. ఈ కేసుపై లోతైన చర్చ జరగాలన్నది తన అభిప్రాయంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

రైతు ఉద్యమానికి మద్దతుగా 200 మంది పోలీసులు రాజీనామా చేశారంటూ ఓ వీడియోను వారిద్దరూ పోస్ట్ చేశారని, వాస్తవానికి పరిస్థితులను ఎలా డీల్ చేయాలో సిబ్బందికి ఆ వీడియోలో పోలీస్ అధికారి సూచిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే, దానికి స్పందించిన జడ్జి.. తానే స్వయంగా కోర్టు రూములో ఆ వీడియో చూశానన్నారు. అందులో రైతులకు అనుకూలంగా ఆ పోలీస్ అధికారి నినాదాలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అక్కడి వాతావరణం కూడా అలాగే ఉందన్నారు. అయితే, ఆ వీడియోను ఒరిజినల్ గా పోస్ట్ చేసింది నిందితులు కాదని, కేవలం ఫార్వర్డ్ మాత్రమే చేశారని దర్యాప్తులో తేలినట్టు గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dissent  Farm laws  farmers protest  sedition law  Delhi court  Delhi Police  crime  

Other Articles