తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగరా మ్రోగింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారాను మ్రోగించింది. ఈ నెల 16 రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీల పక్షాన సాగనున్న ఈ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టనున్నాయి.
తెలంగాణలోని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-వరంగల్-నల్గోండ జిల్లాల ఉపాధ్యయ స్థానానికి మార్చి 14న పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీలో తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక ఖమ్మం-వరంగల్-నల్గోండ ఉపాధ్యాయ స్థానంలో తమ అభ్యర్థిని బలపర్చేందుకు.. పీఆర్టీయు నేత, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఈ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి బరిలో నిలుపుతుండగా, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను నల్గోండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యయ ఎమ్మెల్సీగా బరిలో నిలిపింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోమారు ఇదే స్థానం నుంచి పోటీకి దిగనున్నారు. అయితే రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ నుంచి మాత్రం అభ్యర్థిని ఇంకా పార్టీ ఖరారు చేయాల్సి వుంది.
ఆంధ్రప్రదేశ్ లో..
ఆంధ్రప్రదేశ్లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 23 చివరి తేదీగా ప్రకటించిన ఎన్నికల సంఘం ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలించనుంది. ఈ నెల 26వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించిన ఎన్నికల సంఘా మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఇక ఓట్ల లెక్కింపు మార్చి 17న జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more