తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగరా మ్రోగింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారాను మ్రోగించింది. ఈ నెల 16 రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీల పక్షాన సాగనున్న ఈ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టనున్నాయి.
తెలంగాణలోని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-వరంగల్-నల్గోండ జిల్లాల ఉపాధ్యయ స్థానానికి మార్చి 14న పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీలో తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక ఖమ్మం-వరంగల్-నల్గోండ ఉపాధ్యాయ స్థానంలో తమ అభ్యర్థిని బలపర్చేందుకు.. పీఆర్టీయు నేత, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఈ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి బరిలో నిలుపుతుండగా, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను నల్గోండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యయ ఎమ్మెల్సీగా బరిలో నిలిపింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోమారు ఇదే స్థానం నుంచి పోటీకి దిగనున్నారు. అయితే రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ నుంచి మాత్రం అభ్యర్థిని ఇంకా పార్టీ ఖరారు చేయాల్సి వుంది.
ఆంధ్రప్రదేశ్ లో..
ఆంధ్రప్రదేశ్లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 23 చివరి తేదీగా ప్రకటించిన ఎన్నికల సంఘం ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలించనుంది. ఈ నెల 26వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించిన ఎన్నికల సంఘా మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఇక ఓట్ల లెక్కింపు మార్చి 17న జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more