వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండున్నర నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం చేస్తున్న రైతులను పరామర్శించి వారితో చర్చలు జరిపేందుకు ప్రధాని నరేంద్రమోడీ వద్ద అసలు సమయమే లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రధానికి పాకిస్థాన్ వెళ్లడానికి, చైనా విహారానికి సమయం వుంటుంది కానీ.. దేశంలోని రైతులను పరామర్శించి వారి సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం ఆయన వద్ద అసలు సమయం లేదని అన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా నిర్భరంగా మార్చిన రైతులకు తమ మద్దతు ఎఫ్పటికీ వుంటుందని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేలా చర్యలు చేపడతామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను ప్రధాని మోడీ సహా బీజేపి నేతలు అవమానిస్తున్నారని, వారిని ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా అభివర్ణిస్తున్నారని అన్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లోని 27 జిల్లాలో పది రోజుల పాటు జై జవాన్, జై కిసాన్ పేరిట కిసాన్ పంచాయతీలు నిర్వహిస్తున్న యూపీ కాంగ్రెస్ సభలో అమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఇవాళ ఉత్రర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో త్రివేణి సంఘమంలో ఆమె మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర సాన్నం ఆచరించారు. ఈ సందర్భంగా అమె ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆ తరువాత అక్కడ వున్న ఆనంద్ భవన్ కు చేరుకుని అక్కడి మ్యూజియం ను సందర్శించారు. అంతకుముందు ఆమె సహారన్ పూర్ లో కిసాన్ పంచాయత్ లో మాట్లాడుతూ.. నిత్యం భూమిని చదను చేసి.. రాత్రింబవళ్లు శ్రమించే రైతులు ఎలా దేశద్రోహులు, ఉగ్రవాదులు అవుతారని ప్రశ్నించారు. ప్రధాని తన సొంత నియోజకవర్గ రైతులు నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు,
సమయం లేక కలవలేదని రైతులు ఓ మేరకు సంయమనం పాటిస్తున్నా.. వారిని కూడా ప్రధాని పార్లమెంటు సాక్షిగా చులకన చేసి మాట్లాడుతున్నారని అమె దుయ్యబట్టారు. రైతులను ఆందోళన జీవి అంటూ.. వారికి మద్దతు ఇస్తున్న వారిని కూడా అందోళన జీవులుగా పరన్నాజీవులుగా పేర్కోనడం దేశ ప్రధానికే చెందిందని అమె మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తాను తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more