కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుమారు మూడు నెలలుగా నిరసనోద్యమన్ని చేపడుతున్న రైతులు తాజాగా మరో అందోళనకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నిరసన తెలుపుతున్న రైతులు మరోమారు దేశవ్యాప్త అందోళనకు పిలుపునిచ్చారు. ఇదివరకే రెండు పర్యాయాలు రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో ఈ సారి పంథాను మార్చి ఏకంగా రైల్ రోకోకు అన్నదాతలు పిలుపునిచ్చారు.
ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని పిలుపునిచ్చిన రైతులు.. ఈ నెల 14న పుల్వామా దాడిలో అసువులు బాసిన అమరజవాన్లకు ఘననివాళి అర్పించేందుకు క్యాండిల్ మార్చ్ ను కూడా చేపట్టనున్నట్లు ప్రకటించారు. 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రైల్ రోకో చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకున్న తరువాత తాము హస్తినను వీడి వెళ్తామని ఇప్పటికే స్పష్టం చేసిన రైతులు.. అందుకు గాను ఈ ఏడాది అక్టోబర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి సమాయాన్ని కేటాయిస్తున్నామని అన్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన తరువాత ఈనెల 6వ తేదీన శనివారం రోజు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భంధనం (చక్కా జామ్) చేసిన రైతులు ఇక రైల్ రోకోకు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతు తెలిపేందుకు ర్యాలీగా వస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం విమర్శలకు దారితీసింది. అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సహా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు.. రైతుల పాలిటశాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలని నినదిస్తూ వల్లభబాయ్ పటేల్ చెస్ట్ ఇన్ స్టిట్యూట్ వరకు చేరకున్నారు.
అక్కడి నుంచి వారు ఆర్స్ విభాగానికి చేరువవుతున్న క్రమంలో వారిపై పోలీసులు దాడి చేసి.. పలువుర్ని గాయపర్చారు. ఈమేరకు అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషకర చర్యగా అభివర్ణించింది. ఇదిలావుండగా క్రితం రోజున పార్లమెంటులోని లోక్ సభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. 76 రోజులుగా కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనోద్యమాన్ని చేపట్టినా.. ఈ క్రమంలో ఏకంగా 206 మంది రైతులు అసువులు బాసినా.. ప్రధాని మాత్రం వారి గురించి పార్లమెంటులో ఏమీ మాట్లాడలేదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు బయట మీడయాతో మాట్లాడుతూ.. ప్రధానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. రైతులకు మద్దతు తెలిపే వ్యక్తులను ప్రధాని అందోళన్ జీవి అని వ్యంగాన్ని ప్రదర్శిచగా, రైతుల నిరసనలపై అలక్ష్యం వహిస్తున్న కేంద్రప్రభుత్వం జూమ్లా జీవి అని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల బాయ్ కాట్ చేసిందని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇక ఇవాళ పంజాబ్ గాయకుడు బబ్బు మాన్ రైతుల దీక్షాస్థలికి చేరుకుని అక్కడి రైతులతో చర్చించారు. ఇదివరకు సోషల్ మీడియాలో మాత్రమే రైతులకు తన మద్దతును తెలిపిన ఆయన.. ఘాజీపూర్ శివార్లకు చేరకుని రైతులకు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రైతుల ఉద్యమాలపై తాను బాలీవుడ్ ప్రముఖులతో చర్చించేందుకు సిద్దమని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more