అధికార వైఎస్సార్సీపి పార్టీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలోని కోటబొమ్మాళి ప్రాంత పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీచేస్తున్న సర్పంచ్ అభ్యర్థిపై ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని, ఒక దశలో స్పరంచ్ అభ్యర్థఇకి మద్దతు పలుకుతున్న వైసీపీ స్థానిక నేతలపై ఆయన వర్గీయులు దాడి కూడా చేశారని కోటబొమ్మాళి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు నమోదు అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అచ్చెన్నాయుడును అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు.
దీంతో నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఆయనను అరెస్ట్ చేసి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలోని వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇదిలావుండగా అచ్చెన్నాయుడి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పంచాయతీ ఎన్నికలలో తన మార్కు విజయాన్ని టీడీపీకి అందిస్తారని అంచనా వేసిన వైసీపీ ఇలాంటి చౌకబారు అరోపణలు చేయించి అరెస్టు చేసిందని దుయ్యబట్టారు.
అచ్చెన్నాయుడిని అరెస్టుపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ అని ఆరోపించారు. అచ్చెన్నాయుడి ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులపై పోలీసులు ఇప్పటి వరకు కేసెందుకు నమోదు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more