దేశం నుంచి పోలియో మహమ్మారిని తరమికొట్టిన ఘనత సాధించిన భారత్.. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సులోపు చిన్నారులకు తప్పనిసరిగా ఏడాదికి ఓ పర్యాయం పోలియో చుక్కలు వేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ మేరకు ఉద్యమంలా పోలీయో చుక్కలు వేసే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ ఏడాది జనవరి 31న ఆదివారం రోజు పోలీయో ఆదివారంగా ప్రకటించిన కేంద్రం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టింది. కాగా మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్షం చిన్నారుల ప్రాణాలపైకి తీసుకువచ్చింది.
పల్స్ పోలియో కార్యక్రమంలో ఈ జిల్లాలోని వికటించిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే స్థానిక వైద్య ఉన్నతాధికారులకు దృష్టికి కూడా ఆలస్యంగా చేరిన ఈ వార్త.. చిన్నారులలో మాత్రం వికటించడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. పోలియో చుక్కలు వేసుకున్న పలువురు చిన్నారులు కొన్ని నిమిషాల వ్యవధిలో అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. వెంటనే తమ పిల్లలను వసంతరామ్ నాయక్ ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరికి చికిత్సను అందించగా, ప్రస్తుతం చిన్నారులందరూ కోలుకుంటున్నారని అసుపత్రి డీన్ డాక్టర్ మిలింద్ కాంబ్లి మీడియాకు తెలిపారు.
యావత్మల్ జిల్లాలోని ఘతాంజీస్, ఖాస్సీ-కోపారీ గ్రామంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రంలో ఏకంగా 2000 మంది చిన్నారులు పోలీయో చుక్కల వేయించుకున్నారు. అయితే అందులో 12 మంది చిన్నారులకు మాత్రం పోలీయో చుక్కల బదులు.. హ్యాండ్ శానిటైజర్ వేయడంతో అస్వస్థతకు గురయ్యారని అసుపత్రిలో పరీక్షలు జరిపిన వైద్యులు పేర్కోన్నారు. వెంటనే తమ తప్పును తెలుసుకున్న అక్కడి సిబ్బంది తమ చర్యలను కప్పిపుచ్చుకున్నారే తప్ప.. చిన్నారుల అరోగ్యానికి ఏమవుతుందోన్న అందోళన వారిలో కనిపించలేదు. దీంతో ఆ గ్రామ పీహెచ్సీ కేంద్రంలోని వైద్యుడు, హెల్త్ వర్కర్, ఆశా వాలంటీర్లపై అక్కడి వైద్యాధికారులు సస్పెండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more