ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే చేపట్టనున్నట్లు ప్రకటించిన నిరవధిక నిరాహార దీక్షకు రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా ప్రకటించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు, రైతు సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆయన నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఇవాళ ఉదయం ప్రకటించిన విషయం విధితమే. తన సొంత పట్టణమైన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఇవాళ ఉదయం ఆయన ప్రకటించారు.
కాగా, ఇవాళ సాయంత్రం ఆయన తన ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావిస్ సమక్షంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. అన్నా హాజరే నిరవధిక నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆఘమేఘాల మీద దేవేంద్ర ఫడ్నావిస్ వచ్చి ఆయను కలిసి చర్చించిన తరువాత ఆయన సమక్షంలోనే సామాజిక కార్యకర్త తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సుదీర్ఘకాలంగా రైతుల పక్షాన అందోళనను చేస్తున్నానని అన్నారు, వారి సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నానని అన్నారు.
శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయడం నేరం కాదన్న ఆయన.. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలియజేసే హక్కు దేశపౌరులకు వుందని అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆంధోళనను చేస్తున్నారని అన్నారు. రైతేల మరణాలను తాను మూడేళ్లుగా ప్రస్తావిస్తున్నానని, వారి ఆత్మహత్యలను తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు. అందుకు గిట్టుబాటు ధర లభించకపోవడమే కారణమని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలను యాభై శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు తన వద్ద లేఖ వుందని అన్న అన్నాహాజరే ఈ క్రమంలోనే తాను రేపట్నించి చేపట్టనున్న దీక్షను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు
అయితే ఇవాళ ఉదయం ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం వినడం లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారానికి సంబంధించిన తమ డిమాండ్లను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు. ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి తాను ఎన్ని లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఢిల్లీలో తాను ఢిల్లీలో దీక్షకు పూనుకుంటాననగా.. సమస్యలను పరిష్కరిస్తామన్న కేంద్రం.. ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more