దేశరాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించింది. అత్యంత కట్టదిట్టమైన భద్రత వుండే విదేశీ రాయబార కార్యాలయాలు వుండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఇవాళ సాయంత్రం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కొద్ది మీటర్ల దూరంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. అయితే స్వల్ప తీవ్రత కలిగిన బాంబు పేలుడు సంభవించడంతో స్థానికంగా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా సమీపంలోని మూడు కార్ల కిటికీ అద్దాలు మాత్రం విస్పోటనం ధాటికి బద్దలయ్యాయని పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్ వద్ద ఈ పేలుడు జరిగిందని ఢిల్లీ పోలీసు అధికారులు ధృవీకరించారు. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు ఈ పేలుడులో ప్రజలకు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. కాగా బాంబును ఇక్కడ అమర్చిన వారెవరు అన్న విషయమై.. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్ లోని సిసిటివి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలానికి చేరుకుని నమానాలను సేకరిస్తున్నారు.
బాంబు పేలుడు ఘటనపై స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్ తో పాటు పోలీసు ఉన్నాతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఢిల్లీ ఢిప్యూటీ పోలిస్ కమీషనర్ ప్రమోద్ కుష్వా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటన ఎలా చోటుచేసుకుంది, ఇందుకు కారణాలు ఏంటి.. దీనిని ఎవరు అమర్చారు.. ఈ ఘటనకు కారకులు ఎవరు అన్న వివరాలను ఇప్పడే చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు, అయితే ఎనమిదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండవ సారి. 2012 ఫిబ్రవరి 13న ఇజ్రాయెల్ దౌత్యవేత్త తాల్ యెహోషువా కోరెన్ కారులో బాంబును అమర్చారు. ఆ పేలుడులో ఆమెకు గాయాలయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more