SEC orders transfer of Praveen Prakash ప్రవీణ్ ప్రకాష్ తప్పించాలని నిమ్మగడ్డ అదేశాలు..

Sec transfer praveen prakash says his continuance is prejudicial to free fair polls

panchayat elections, Praveen Prakash, N. Ramesh Kumar, Aditya Nath Das, guntur collector Samuel Anand Kumar, Chittoor collector Narayana Bharat Gupta, Tirupati Urban SP Ramesh Reddy, Dinesh Kumar, Markandeyulu, re-shedule of GP Elections, supreme court, AP panchayat elections, panchayat elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

The State Election Commissioner N Ramesh Kumar wrote a letter to Chief Secretary Adityanath Das seeking action against Principal secretary (pol) GAD Praveen Prakash as he failed to implement the proceedings of SEC, which has written to the Govt with regard to taking action against some officers earlier who had come under the adverse notice of election commission.

ఏపీ ఎన్నికల ‘పంచాయతీ’: ప్రవీణ్ ప్రకాష్ తప్పించాలని నిమ్మగడ్డ అదేశాలు..

Posted: 01/29/2021 04:12 PM IST
Sec transfer praveen prakash says his continuance is prejudicial to free fair polls

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు పచ్చజెండాను ఊపిన నేపథ్యంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికార నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మరోమారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ మరో లేఖను రాశారు. ఈ సారి లేఖలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పేర్కోన్నారు.

రెండురోజుల క్రితం గుంటూరు కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్భన్ ఎస్పీ రమేష్ రెడ్డీలను బదిలీ చేయాలని అదేశిస్తూ సీఎస్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ ఈ సారి ఏకంగా సీఎం జగన్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను టార్గెట్ చేశారు. ఆయన ఎన్నికల విధుల్లో పాల్గోనకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సకాలం జరగేలా చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్ ప్రకాష్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన తెలిపారు.  

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాను ఈ నెల 23న నిర్వహించాల్సిన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలు జరగకుండా చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ పాత్ర వుందన్న ఆయన తన అదేశాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ గా వున్న ప్రవీణ్ ప్రకాష్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధికారులను ఎన్నికలకు సన్నధం చేయడంలోనూ ఆయన పాత్ర వుందన్న నిమ్మగడ్డ.. ప్రవీణ్ ప్రకాష్ కారణంగానే ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇక అంతుకుముందు రాసీన మరోలేఖలో దృవీకరణ పత్రాలపై సీఎం ఫోటోలను తొలగించాలని కూడా అదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వా ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖలో పిర్యాదు చేశారు. ఇక మంత్రులు కూడా ఎన్నికల నియమావళి కొనసాగుతున్న క్రమంలో లక్ష్మణ రేఖ దాటారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles