Srivari Laddu Prasadam to devotees begins today శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం.. ఇవాళ్టి నుంచే ప్రారంభం

Srivari laddu prasadam to devotees begins today

Tirupati, Tirumala, TTD, Laddu Prasadam, Lockdown, Srivari Laddu prasadam, Srivari Darshan, Devotees Darshan, Coronavirus, Andhra Pradesh

After 55 days of gap due to lockdown, the Tirumala Tirupati Devasthanams has resumed its Prasadam sales at the TTD Administrative Building in Tirupati on trial basis. For this a special counter has been set up by the officials near the employees' canteen at the Administrative Building.

శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం.. ఇవాళ్టి నుంచే ప్రారంభం

Posted: 05/16/2020 01:11 PM IST
Srivari laddu prasadam to devotees begins today

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూల అమ్మకాలను టీటీడీ నిలిపివేసింది. దీంతో గత 50పైచిలుకు రోజుల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం బాగ్యం కలగడం లేదన్నది వాస్తవం.  లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించడంపై టీటీడీ కసరత్తు చేసింది. అందులో భాగంగా నిత్యం 14 గంటల పాటు భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించాలని నిర్ణయించింది. ఒక్క గంటకు 500 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో రోజూకీ 7000 మంది మాత్రమే దర్శనానికి పరిమితం కానున్నారు. కాగా తొలి మూడు రోజులు ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు టీటీడీ ఉద్యోగులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ తరువాత తిరుపతిలో ఉన్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అనుమతించేందుకు టీటీడీ యోచిస్తోంది. ఆన్ లైన్ ద్వారా దర్శన టికెట్లను బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టికెట్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు. ప్రయోగాత్మకంగా పరిశీలన పూర్తయిన తర్వాత అంచెల వారీగా చిత్తూరు జిల్లా వాసులు, తరువాత సాధారణ భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. ఇకపోతే వసతి సౌకర్యం కోసం ఇచ్చే గదులను ఇద్దరికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత అందరినీ దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.

ఇక లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలను ఇవాళ ఉదయం నుంచి ప్రారంభించింది. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద లడ్డూ ప్రసాదాలు మొదలయ్యాయి. దాదాపు 55 రోజుల తర్వాత లడ్డూ విక్రయాలు మొదలుకావడంతో విషయం తెలుసుకున్న భక్తులు బారులుదీరారు. కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles