COVID-19 | 48 fresh cases reported in AP ఏపీలో 2200 మార్కు దాటిన కరోనా కేసులు

Coronavirus latest updates slowdown of covid cases in ap 48 fresh cases in last 24 hours

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

48 new coronavirus cases were reported in Andhra Pradesh, this brings the total reported cases of coronavirus in Andhra Pradesh to 2,205. Among the total people infected as on date, 1353 have recovered and 49 have passed away.

ఏపీలో 2200 మార్కు దాటిన కరోనావైరస్.. గడిచిన 24 గంటల్లో 48 కేసులు..

Posted: 05/16/2020 02:59 PM IST
Coronavirus latest updates slowdown of covid cases in ap 48 fresh cases in last 24 hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన కాసింత నెమ్మదించింది. రాష్ట్ర వాసుల్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి.. క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుందన్న సమయంలోనే మళ్లీ వేగాన్ని అందుకుంది. దీంతో రాష్ట్రవాసుల్లో మళ్లీ అందోళన రేకెత్తుతోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మిషన్ లను కూడా ఏర్పాటు చేసుకోవడంతో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న నమోదైన 57 కేసులతో పోల్చితే ఇవాళ కేసుల సంఖ్య కాసింత తగ్గడం ఊరటనిస్తోంది. చెన్నైలోని కోయంబేడే మార్కెట్ మరో మారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా నమోదైన 48 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల 2 వందల మార్కుకు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2205కి చేరింది. కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్యకు మాత్రం బ్రేక్ పటడం లేదు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి వాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.

ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 48 మరణాలు సంభవించడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కర్నూలు తొమ్మిద, నెల్లూరు తొమ్మిది, గుంటూరు తొమ్మిది, చిత్తూరులో ఎనమిది, కృష్ణలో ఏడు, కడపలో ఒకటి, విశాఖపట్నంలో నాలుగు, పశ్చిమ గోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 1353 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 803 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా రాష్ట్రంలో మరో కరోనా మరణం కూడా నమోదైంది. దీరతో మరణాల సంఖ్య 49కి చేరింది.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 122 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 52 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 413 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 102 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 367 పాజిటివ్ కేసులు, పద్నాలుగు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 608గా వుండగా, 19 మరణాలు సంభవించాయి. నెల్లూరు-149 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 63, శ్రీకాకుళంలో ఏడు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 68 కరోనా కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 7, పశ్చిమగోదావరి-70 కేసులు నమోదయ్యాయి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles