India reaches 85,940 Covid-19 cases 86 వేల కరోనా కేసులతో చైనాను మించిన భారత్..

Coronavirus update covid 19 cases in india reaches 85 940

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India witnessed its biggest jump in Coronavirus-linked cases today, with 3970 people testing positive for COVID-19 in the last 24 hours, government data showed. Positive cases tally reaches to 85940 people have tested positive for coronavirus and 2752 have died due to the virus.

86 వేల కరోనా కేసులతో చైనాను మించిన భారత్.. 2752 మరణాలు

Posted: 05/16/2020 12:06 PM IST
Coronavirus update covid 19 cases in india reaches 85 940

దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. మరిన్ని సడలింపులతో నాల్గవ విడత లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో అమల్లోకి రానుండటంతో.. గత పక్షం రోజుల నుంచి ప్రతీరోజు మూడువేల కేసులు నమోదు అవుతుండగా ఇక గత వారం రోజు లనుంచి రమారమి నాలుగు వేలకు ఈ కేసులు చేరుతున్నాయి, దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేల మార్కుకు చేరింది. ప్రతీరోజు మూడు వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి కేసులు నమోదు కాగా, మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి రాగానే కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మూడు వేల 970 పాజిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 86 వేల 940 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2752కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 103 మరణాలు సంభవించాయి.

దీంతో వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 30,153 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 53,035 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.

దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 1576 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 29100 కేసులు నమోదు కాగా, మొత్తంగా 1068 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ మొత్తం 9931 కేసులు నమోదు కాగా, 606 మంది కరోనాబారిన పడి మరణించారు.

తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మొత్తం కేసులు సంఖ్య 10108కు చేరగా, 71 మరణాలు సంభవించాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మొత్తం కరోనా కేసులు 8470కు చేరగా, 115 మరణాలు నమోదయ్యాయి, ఆ తరువాత మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 4595 కేసులు నమోదు కాగా, 239 మంది మరణించారు, పశ్చమ బెంగాల్ లో  2461 కేసులు నమోదు కాగా, 225 మంది మరణించారు. ఇక రాజస్థాన్ లో 4727 కేసులు నమోదు కాగా మొత్తం 125 మరణాలు సంభవించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles