COVID-19 | 33 fresh cases reported in AP ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Coronavirus latest updates slowdown of covid cases in ap 33 fresh cases in last 24 hours

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

33 new coronavirus cases were reported in Andhra Pradesh, this brings the total reported cases of coronavirus in Andhra Pradesh to 2,051. Among the total people infected as on date, 1056 have recovered and 46 have passed away.

ఏపీలో నెమ్మదిస్తున్న కరోనావైరస్.. గడిచిన 24 గంటల్లో 33 కేసులు..

Posted: 05/12/2020 01:05 PM IST
Coronavirus latest updates slowdown of covid cases in ap 33 fresh cases in last 24 hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన నెమ్మదించింది. రాష్ట్ర వాసుల్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి.. క్రమంగా తన వేగాన్ని తగ్గించింది. దీంతో రాష్ట్రవాసులకు స్వల్ప ఊరటనిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మిషన్ లను కూడా ఏర్పాటు చేసుకోవడంతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 33 కేసులు మాత్రమే నమోదు కాగా, దాదాపు మూడు వారాల తరువాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ కఠిన నిబంధనలు, వైద్యులు, హెల్త్ వర్కర్ల, పోలీసుల శ్రమకు ఫలితం లభిస్తోంది.

తాజాగా నమోదైన 33 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల మార్కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 2051కి చేరింది. కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్యకు మాత్రం బ్రేక్ పటడం లేదు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి వాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.

ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 44 మరణాలు సంభవించడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైద్యుల శ్రమకు ప్రతిఫలం చేకూర్చేలా ఫలితాలు వస్తుండటం విశేషం.  తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా చిత్తూరులో 10, కర్నూలులో తొమ్మిది, నెల్లూరులో తొమ్మిది, కృష్ణలో నాలుగు, తూర్పు గోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 1056 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 949 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా రాష్ట్రంలో మరో కరోనా మరణం కూడా నమోదైంది.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 115 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 131 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 47 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 387 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 97 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 346 పాజిటివ్ కేసులు, పద్నాలుగు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 584గా వుండగా, 16 మరణాలు సంభవించాయి. నెల్లూరు-111 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 63, శ్రీకాకుళంలో ఐదు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 66 కరోనా కేసులు నమోదుకాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 4, పశ్చిమగోదావరి-68 కేసులు నమోదయ్యాయి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles