At 79 cases, Telangana reports highest one-day jump హైదరాబాద్ పై పంజా విసురుతున్న కరోనా.. ఒక్కరోజులో 72 కేసులు

Covid 19 update telangana sees spike in covid 19 as hyderabad reports 79 cases in one day

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana reported 79 new cases of COVID-19 on Monday, taking the total positive cases in the state to 1,275. All 79 new positive cases reported were from the jurisdiction of the Greater Hyderabad Municipal Corporation (GHMC)

హైదరాబాద్ పై పంజా విసురుతున్న కరోనా.. ఒక్కరోజులో 79 కేసులు

Posted: 05/12/2020 12:17 PM IST
Covid 19 update telangana sees spike in covid 19 as hyderabad reports 79 cases in one day

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసులు వెలుగుచూసిన తొలినాళ్లలోనే విదేశాలకు వెళ్లి కర్ణాటకలోని తన కార్యాలయానికి వెళ్లి అటు నుంచి సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ కు వచ్చిన బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు మే నెల నుంచి తగ్గుముఖం పట్టాయి. అయినా ఎలాంటి సడలింపులు లేకుండా ముందుకెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మే 3వ తేదీ వరకు అంతా సవ్యంగానే సాగింది.

ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పాటిస్తూ మే నెల 6వ తేదీ నుంచి తెలంగాణలోనూ సడలింపులు ఇవ్వడంతో.. కరోనా మరోమారు పంజావిసురుతోంది. మే 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక దీనికి తోడు ప్రతిపక్షాల విమర్శలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. తెలంగాణలో కరోనా అనుమానితులకు టెస్టులు చేయడం లేదంటూ.. విపక్ష రాజకీయ పార్టీలు అరోపణలు కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని అటుంచితే సడలింపులు కూడా తెలంగాణలో కరోనా కేసుల నమోదుకు పెరగడానికి మరోకారణంగా అరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులు తెలంగాణలో నమోదైన గరిష్ట కేసుల సంఖ్యగా తేలడం మరో అందోళకన విషయం. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 50 కాగా, కోలుకున్నవారి సంఖ్య 801కి పెరిగింది. ప్రస్తుతం 444 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, మరణాల సంఖ్య 30 అని తెలంగాణ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా ఇంతలా కేసులు పెరగడానికి కారణం ఏంటన్న విషయమై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

అయితే అనధికారక కథనాల ప్రకారం సరూర్ నగర్ లోని ఓ దుకాణం వ్యాపారికి మలక్ పేట్ గంజ్ నేపథ్యంలో కోరనా ప్రభావాన పడ్డాడని, అతని ఆ తరువాత తన స్నేహితుడి చిన్న పార్టీకి వెళ్లడంతో అక్కడ ఈ వైరస్ ఇతరులకు సోకిందని, దీనికి తోడు ఆ పార్టీలో చార్మినార్ నుంచి వచ్చిన పలువురికి కూడా కరోనా వుండటంతో ఇక ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమైందని తెలుస్తోంది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో అత్యధికం నగరంలోని జియాగూడలోనే నమోదైయ్యాయని సమాచారం. హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ నగరంగా ఖ్యాతిపోందుతున్న తరుణంలోనే కరోనా వైరస్ పంజా విసరడం.. నగర భవిష్యత్ అభివృద్దికి అవరోధంగా కూడా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles