దేశ రైతాంగాన్ని వరుణుడు ఈ సారి ముందుగానే కరుణించాడు. పలు పర్యాయాలు వరుణ దేవుడా ఎప్పుడోస్తావు.. అంటూ రైతన్న కంటి రెప్ప వాల్చకుండా ఎదురుచూసినా నిరీక్షింపజేసే వరణుడు ఈ సారి మాత్రం రైతన్నను ముందుగానే పలకరించనున్నాడు. గతేడాది కంటే ఈసారి రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అండమాన్ లోకి ప్రవేశించనున్నాయి. గతేడాది మే 18న అండమాన్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఈసారి 16నే ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కేరళ, తెలంగాణ సహా ఇతర దక్షిణాధి రాష్ట్రాలతో పాటు మధ్యభారతంలోని ప్రాంతాల్లో నైరుతి ఎప్పుడు ప్రవేశిస్తుందన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో భారత వాతావరణ విభాగం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు నైరుతి రుతుపవనాలు ముందస్తుగా మే 25న ప్రవేశించగా ఇక ఆలస్యంగా జూన్ 6వ తేదీన ప్రవేశించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సాధరణ సగటున జూన్ 1 గా నమోదైంది. అయితే గత ఏడాది 18వ తేదీని అండమాన్ దీవుల్లోకి నైరుతి పవనాలు ప్రవేశించినా.. కేరళ రాష్ట్రంలోకి చేరేందుకు మాత్రం మరో వారం గడువును తీసుకుంది. దీంతో ఈ సారి వీటి ప్రవేశం కేరళలో ఎప్పటికి చేరుతుందా అన్న విషయమై మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం ఈ నెలలో తెలయిజేయనుంది,
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే నైరుతి రుతుపవనాల తొలకరి జల్లులు ముందుగానే వస్తున్నాయన్న సమాచారంతో దేశ రైతంగం కూడా సన్నధమైంది. పొలం చదను చేసే పనులకు రైతన్న రెడీ అయ్యాడు. తొలకరి తొందరగానే పలకరిస్తుందన్న వార్తలతో.. తొలకరితో భూమి తల్లి తడవగానే విత్తనాలు చల్లి.. నాట్లకు సిద్దం కావాలని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తాను సమకూర్చకున్న విత్తనాలను కూడా రెడీగా పెట్టుకున్నాడు. అయితే గతేడాదిలా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడం ఆలస్యమైతే ఏం చేయాలన్న దిగులు కూడా రైతన్నలలో మరోవైపు కనిపిస్తోంది. అయితే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సాధారణాన్ని మించిన వర్షపాతం నమోదువుతుందని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more