మానవాళి ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ.. మనిషి మనుగడకు పెను సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ అప్పుడే ఆరు నెలలు గడిచింది. ఎండకాలం కూడా రమారమి పూర్తి కావస్తోంది. ఆ తరువాత వర్షాకాలంలో సాధరణంగానే వైరస్ ఫ్లూలు, అతిసారవ్యాధులతో పాటు అంటువ్యాధులు ప్రబలే కాలం. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి జూలై నెలలో మరింత వేగంగా విస్తరించే అవకాశాలు వుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో అంచనా వేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి వేగవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల తక్కువ నష్టమే కలిగిందని అన్నారు.
అంతకంటే ముందు కొన్నిరోజుల పాటు కొత్త కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతాయని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య కొంతకాలం పెరుగుతుందని.. అయినా భయడపడాల్సిన అవసరం లేదని నబారో స్పష్టం చేశారు. అక్కడక్కడ పెరిగినప్పటికీ.. క్రమంగా కట్టడిలోకి వస్తుందని తెలిపారు. లాక్డౌన్ సత్ఫతాలిచ్చిందని.. దీనివల్ల వైరస్ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంపై నబారో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. జనాభాతో పోలిస్తే ఇప్పటి వరకు నమోదైన కేసులు చాలా తక్కువేనని అభిప్రాయపడ్డారు.
దేశంలో వృద్ధుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల మరణాలు రేటు కూడా చాలా తక్కువగా నమోదవుతుందని వివరించారు. ప్రపంచ అరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపై ప్రస్తావిస్తూ.. ఓ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి.. తమ సంస్థ పనితీరుపై ఆరోపణలు గుప్పించడం వల్ల వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని స్పష్టం చేశారు. చైనాకు సంస్థ అనుకూలంగా పనిచేస్తుందన్న ట్రంప్ విమర్శలు డబ్ల్యూహెచ్ఓ సాధారణ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యం నుంచి సంస్థ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more