COVID-19 | Three more deaths, 43 fresh cases reported in AP ఏపీలో అందోళన కలిగిస్తున్న కరోనా మరణాలు..

Coronavirus latest updates three more covid 19 deaths 43 fresh cases reported in ap

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The State reported three more COVID-19 deaths and 43 fresh cases during the past 24 hours during which 8,388 samples were tested. The tally has reached 1,930 while the toll mounted to 44.

ఏపీలో అందోళన కలిగిస్తున్న కరోనా మరణాలు.. గడిచిన 24 గంటల్లో మూడు మరణాలు..

Posted: 05/09/2020 12:29 PM IST
Coronavirus latest updates three more covid 19 deaths 43 fresh cases reported in ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన స్వల్పంగా తగ్గుతోంది, రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన నాటి నుంచి గ్రీన్ జోన్లుగా నమోదవుతూ వచ్చిన విజయనగరం జిల్లాను కూడా మొదటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనాకు దూరంగా గ్రీన్ జోన్ లో వుండగా.. గత పది రోజుల క్రితం శ్రీకాకుళం.. ఇక తాజాగా విజయనగరం జిల్లాలు కూడా రెడ్ జోన్ లోకి చేరిపోయాయి. గత మూడు రోజుల నుంచి ఈ సంఖ్య 60 మార్కును దాటకుండా నమోదవుతున్న కేసులు గడిచిన 24 గంటల్లో మరింత ఊరట లభించేలా నమోదైన పాజిటివ్ కేసులు తగ్గాయి, అయితే మరణాలు మాత్రం పెరగడం అందోళన రేపుతోంది.

ప్రభుత్వం కంటైన్మెంట్ కఠినచర్యలు తీసుకుంటున్నా.. కరోనావైరస్ మాత్రం తన వ్యాప్తి చాటుకుంటూనే వుంది. గత కొద్దికాలంగా ప్రతీరోజు 50పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన కేసులు ఇవాళ కొంత తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తున్నా.. మరణాలు నమోదు కావడం మాత్రం అందోళన రేపుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 43 కేసులు నమోదు కాగా, మూడు మరణాలు సంభవించాయి, కొత్తగా నమోదైన 43 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19 వేల మార్కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1930కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో తాజాగా నమోదైన మూడు మరణాలతో కలపి మొత్తం 44కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కృష్ణాలో పదహారు, చిత్తూరులో 11, కర్నూలులో 6, గుంటూరులో రెండు, అనంతపురం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 887 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 999 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 102 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 96 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 46 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 376 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 96 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 338 పాజిటివ్ కేసులు, పదమూడడు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 553గా వుండగా, 15 మరణాలు సంభవించాయి. నెల్లూరు-96 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, శ్రీకాకుళంలో ఐదు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 57 కరోనా కేసులు నమోదుకాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 4, పశ్చిమగోదావరి-68 కేసులు నమోదయ్యాయి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles