ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన స్వల్పంగా తగ్గుతోంది, రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన నాటి నుంచి గ్రీన్ జోన్లుగా నమోదవుతూ వచ్చిన విజయనగరం జిల్లాను కూడా మొదటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనాకు దూరంగా గ్రీన్ జోన్ లో వుండగా.. గత పది రోజుల క్రితం శ్రీకాకుళం.. ఇక తాజాగా విజయనగరం జిల్లాలు కూడా రెడ్ జోన్ లోకి చేరిపోయాయి. గత మూడు రోజుల నుంచి ఈ సంఖ్య 60 మార్కును దాటకుండా నమోదవుతున్న కేసులు గడిచిన 24 గంటల్లో మరింత ఊరట లభించేలా నమోదైన పాజిటివ్ కేసులు తగ్గాయి, అయితే మరణాలు మాత్రం పెరగడం అందోళన రేపుతోంది.
ప్రభుత్వం కంటైన్మెంట్ కఠినచర్యలు తీసుకుంటున్నా.. కరోనావైరస్ మాత్రం తన వ్యాప్తి చాటుకుంటూనే వుంది. గత కొద్దికాలంగా ప్రతీరోజు 50పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన కేసులు ఇవాళ కొంత తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తున్నా.. మరణాలు నమోదు కావడం మాత్రం అందోళన రేపుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 43 కేసులు నమోదు కాగా, మూడు మరణాలు సంభవించాయి, కొత్తగా నమోదైన 43 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19 వేల మార్కు దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1930కి చేరింది.
ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో తాజాగా నమోదైన మూడు మరణాలతో కలపి మొత్తం 44కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కృష్ణాలో పదహారు, చిత్తూరులో 11, కర్నూలులో 6, గుంటూరులో రెండు, అనంతపురం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 887 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 999 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 102 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 96 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 46 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 376 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 96 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 338 పాజిటివ్ కేసులు, పదమూడడు మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 553గా వుండగా, 15 మరణాలు సంభవించాయి. నెల్లూరు-96 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 61, శ్రీకాకుళంలో ఐదు కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 57 కరోనా కేసులు నమోదుకాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 4, పశ్చిమగోదావరి-68 కేసులు నమోదయ్యాయి,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more