విశాఖలో విషవాయువు లీక్ కావడంతో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతంలోని ఐదు గ్రామాల్లోని చెట్లు చేమలు పూర్తిగా వర్ణం మారిపోయాయి. ఈ తరుణంలో ఈ గాలిని పీల్చి అస్వస్థతకు గురైన బాధితుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి, బాధితులపై ఈ విషవాయువులు పీల్చిన ప్రభావం వైద్యంతో నయం అవుతుందా.? లేక వారి జీవితకాలం వారిని వెన్నాడుతోందా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ తరహా ప్రశ్నలు ఉత్పన్నమై ఏకంగా ఐదు గ్రామాలవారిలో అందోళన రెకెత్తుతోంది.
ఇక విషవాయువులు పీల్చిన వారిని ఇప్పుడు కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ విష రసాయన గాలిని పీల్చిన 554 మంది బాధితుల్లో 52 మంది చిన్నారులే ఉన్నారు. దీంతో వీరిపై దీని ప్రభావం జీవిత కాలం వుంటే ఎలా అన్న అందోళన బాధితుల్లో వ్యక్తం అవుతోంది. కాగా, ఆ అందోళనలకు బలం చేకూర్చుతూ రసాయనక గాలి పీల్చిన బాధితుల్లో దీని ప్రభావం ఇప్పుడే కనబడుతోంది. బాధితుల శరీరం కమిలిపోతుంది. కొందరికి ఒంటిపై బబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
తొలుత శరీరంపై దురద, మంట ఏర్పడుతోందని అనంతరం చర్మం కమిలిపోయి బబ్బలు వస్తున్నాయి. దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఎల్జిపాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువు లీకైన ఘటనలో పలువురు ఆస్పత్రి పాలైనసంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more